నేచుర‌ల్ స్టార్ నానీ నిర్మాత‌గా మారాడు.. వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ పై నానీ స‌మ‌ర్ప‌ణ‌లో ‘అ!’ పేరుతో ఒక మూవీ రూపొంద‌నుంది.. ఈ మూవీకి ప్ర‌శాంత్
ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ చెప్పిన క‌థ నానీకి న‌చ్చ‌డంతో అత‌డికే దర్శ‌కుడిగా తొలి అవ‌కాశం ఇస్తూ, తానే నిర్మాత‌గా మారాడు నానీ.  అన్ని సినిమాలయందు ‘అ!’ సినిమా వేరయా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది నాని ‘అ!’. ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ చిత్రంతో తాజా హిట్ అందుకున్న నాని నిర్మాతగా మారి వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘అ!’.
Image result for ‘అ’ సెన్సార్ రిపోర్ట్
ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ మూవీ సెన్సార్ ఫార్మాల్టీస్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి ‘అ !’ మూవీకి యు/ఏ సర్టిఫికేట్ లభించింది.  ఈ మూవీలో రెజినా నిత్యా మీన‌న్, కాజ‌ల్, నానీ, ర‌వితేజ‌, ఈషా రెబ్బా, ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి లు కూడా క‌నిపించ‌నున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాని (చేపగా), రవితేజ (చెట్టుగా) సొంత వాయిస్ ఓవర్‌తో కనిపించనున్నారు. 

ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అ!’ మూవీకి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో నిత్యామేనన్‌, కాజల్‌, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా,  ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: