సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా రంగస్థలం. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, రెండు టీజర్ల ద్వారా చెర్రీ, సామ్‌ల ఇంట్రడక్షన్.. అదరగొట్టేశాయి. ఒక్కొక్క క్యారెక్టర్‌ను సెపరేట్‌గా రివీల్ చేస్తూ సినిమాపై మంచి క్రేజ్ ని పెంచడంలో సుక్కు సక్సెస్ అయ్యారు.  తాజాగా రంగస్థలం నుంచి మొదటిసాంగ్ సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది. ఇటీవల ఈ మూవీ నుండి సమంత రోల్‌కి సంబంధించి ‘రామలక్ష్మి టీజర్’ చిట్టిబాబు గుండెకాయని గోలెట్టించేసి సోషల్ మీడియాను హోరెత్తించింది.

విడుదలైన అతి తక్కువ టైంలో ఆరున్నర మిలియన్ల వ్యూస్‌ని క్రాస్ చేసిందంటే రామలక్ష్మి‌కి యూత్‌లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. చంద్రబోస్ ఈ పాటను రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. రంగస్థలం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: