ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హీరో నితిన్ ఈ రోజు ‘చల్ మోహన రంగ’ టీజర్తో సర్ప్రైజ్ చేశాడు. ఎంతో అద్భుతంగా ఉన్న టీజర్ ఫ్యాన్స్ని ఎంతగానో అలరిస్తుంది. ‘‘వర్షాకాలంలో కలుసుకున్నమేము శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవి కాలంలో విడిపోయాం అని నితిన్ అనగా, మీరిద్దరు వెదర్ రిపోర్టర్సా భయ్యా’’ అంటూ పలికిన డైలాగ్ సినీ లవర్స్ ని ఆకట్టుకుంటుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం విశేషం.ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ‘చల్ మోహన రంగ’ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో షూటింగ్ జరుపున్న ఈ చిత్రానికి ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ పూర్తైంది. తమన్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. అ..ఆ సినిమా తర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి.