ఈ మద్య టాప్ హీరోలు తమ అభిమానులు చనిపోతే వారికి ఘన నివాళులు అర్పించడమే కాదు..కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంతే కాదు వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. మొన్న కార్తీ, నిన్న లారెన్స్, నేడు సుదీప్.. అభిమాని మృతితో వారు కంటతడి పెట్టారు. తమని ఎంతగానో ప్రేమించే అభిమాని మరణించారనే వార్త వారిని ఎంతగానో కలచివేసింది. బెంగళూరుకి చెందిన వినూత అనే యువతి కొంత కాలంగా క్యాన్యర్ వ్యాధితో బాధపడుతోంది.
ఈమెకి సుదీప్ అంటే ప్రాణం. తన అభిమాన హీరో సుదీప్ ని చూడకుండానే చనిపోతానా అని తెగ బాధపడిందట ! ఈ విషయం సుదీప్ అభిమానులకు తెలియడంతో ఈ విషయాన్నీ సుదీప్ కు తెలిపారు . విషయం తెలిసిన వెంటనే వినూత ని తన ఇంటికి పిలిపించుకొని ఆమె కు ధైర్యం చెప్పాడు. వ్యాధితో కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పాడు.
అంతేగాకుండా ఆమెతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే కేన్సర్ చివరి దశకు చేరడంతో మంగళవారం సాయంత్రం వినూత మృతి చెందింది. ఈ విషయాన్ని అభిమాన సంఘం సభ్యులు సుదీప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుదీప్ కంటతడి పెట్టారు. తన చిన్నారి చెల్లెలు వినూత ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గతంలో వినూతతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.