తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మెగా హీరోలు వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు గత సంవత్సరం ‘ధృవ’ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని..మార్చి 30 రిలీజ్ కి సిద్దంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, చిట్టిబాబు, సీతామాలక్ష్మి టీజర్లు దుమ్ముదులిపేస్తున్నాయి. పూర్తిగా 1985 నాటి కాలం మన కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారని టీజర్లు చూస్తుంటే తెలుస్తుంది.
ఇక పూర్తిగా మాస్ లుక్ లో రాంచరణ్, సమంతలను చూస్తుంటే సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా తీయబోతున్నాడు. ఆ మద్య షూటింగ్ ముహూర్తం కూడా ప్రారంభించారు. యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. గత సంవత్సరం బెల్లంకొండ శ్రీనివాస్ తో 'జయ జానకి నాయక' చిత్రం మంచి విజయం సాధించాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్తో తీస్తున్న ఈ చిత్రానికి 'జిల్ జిల్ జిగేల్' పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా బోయపాటికి ఇతర భాష నటులను తీసుకునే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో జయ జానకి నాయక చిత్రంలోనూ తమిళ స్టార్ శరత్ కుమార్ని ఎంపిక చేసుకున్న ఆయన, ఈ సారి చరణ్ చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ని సెలక్ట్ చేసుకున్నారు. ఆ మద్య అజిత్ కుమార్ నటించిన వివేగం చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే.
'రక్తచరిత్ర' చిత్రం ద్వారా వివేక్ ఒబెరాయ్ తెలుగు ఆడియన్స్కు బాగానే కనెక్టయ్యాడు. చరణ్తో బోయపాటి తీస్తున్న ఈ చిత్రంలో వేక్ విలన్ పాత్రలో కన్పించనున్నాడు. ఆయన పాత్రను దర్శకుడు స్పెషల్గా తీర్చిదిద్దాడనే వార్త వినబడుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.