మంచి సినిమా అనిపించుకున్న "ఊహలు గుసగుస లాడే" చిత్రంలో కథానాయకిగా అద్భుతంగా నటించిన రాశీ ఖన్నా కాస్త బొద్దుగా, చబ్బీగా ఉండేది. టాలీవుడ్ హీరోలకు తరవాత కాలంలో రాశీ ఖన్నా బొద్దుగా ఉండటమే అడ్డుకావడంతో సరైన అవకాశాలు ఆమె కు ఎప్పుడూ ఎక్కడా పెద్దగా దక్కలేదు.
పట్టుదలతో తన బొద్దే అడ్డు అని భావించిన రాశీఖన్నా పట్టుదలతో ప్రయత్నించి తన శరీరంలో పేరుకకు పోయిన బొద్దు తనాన్ని దానికి కారణమైన కొవ్వును జింకు వెళ్ళి కరిగించేసింది. దీంతో ఆమెకు జయ్ లవకుశ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అద్భుత అవకాశం దక్కించుకుంది. అయితే గతంలో ఓ చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అదే మెగా హీరో రామ్ చరణ్ సరసన నటించే అవకాశం. రంగస్థలం సినిమాలో రాశీఖన్నా నటిస్తుందని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో సమంత వచ్చి ఆమె స్థానంలో చేరింది.
అయితే రాశీ నటించిన "తొలిప్రేమ" లో వర్ష పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకాదరణ సాధించింది. స్లింగా నాజూగ్గా మారటంతో పాటు మంచి నటన ప్రదర్శించిన హీరోయిన్ అనే ప్రశంసలు వచ్చాయి. స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలు చేసు కుంటూ వస్తోంది రాశీఖన్నా. ఎక్కడా గ్యాప్ మాత్రం లేదు. రాను రాను మరింత గ్లామర్ గా తయారవుతూ, అభిమానులను అలరిస్తోంది.
దీంతో ఆమెకు అనూహ్యంగా తిరిగి రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కిందని ఫిలిం నగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అదీ కూడా రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, ఎన్టీఆర్ లతో తీస్తున్న మల్టీ స్టారర్ మూవీలో, నటించే అవకాశం రాశీ ఖన్నాకు దక్కిందని తెలుస్తుంది. వినిపిస్తున్న గ్యాసిప్ నిజమైతే రాశీ ఖన్నా పంట పండి నట్లే. ఎందుకంటే రామ్ చరణ్ పక్కన నటించడం అన్నది మాత్రమే కాదు, రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా చేయడం అన్నది. దీంతో రాశీ ఖన్నా దశ తిరిగినట్లే, అంటున్నారు.