‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలోని ‘సీటీమార్.. సీటీమార్’ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ఏ రేంజ్లో సందడి చేశారో తెలిసిందే. ఆ హిట్ సాంగ్లోని ‘సీటీ మార్ ’ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రదర్శకుడు హరీష్ శంకర్ ఈ ‘సీటీమార్’ సినిమాకి దర్శకుడు.
ప్రస్తుతం దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా పూర్తి అయ్యాక సీటిమార్ చిత్రాని తెరకెక్కించబోతున్నాడు. ‘దాగుడుమూతలు’ విషయానికి వస్తే.. శర్వానంద్ , నితిన్ ఈ సినిమాలో నటించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా మే నెల నుండి ప్రారంభం కానుంది.
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను బన్నీతోనే చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ టైటిల్ ఆయనకే సెట్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగే అవకాశం వుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.