ఈ మద్య భారతీయ చలన చిత్రాల్లో ఎక్కువ శాతం అడల్ట్ కాంటెంట్ ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ జాడ్యం మరీ ఎక్కువ అయ్యింది.  దాంతో ఇతర భాషల్లో వస్తున్న చిత్రాలు కూడా బూతు కంటెంట్ తో వస్తున్నాయి.  ఎన్ని విమర్శలు వస్తున్నా దర్శక,నిర్మాతలు మాత్రం ఎక్కువ దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు.  కారణం తక్కువ ఖర్చు..పోటీ పడి నటించే బి గ్రేడ్ హీరోయిన్లు..ఒక్కసారి క్లిక్ అయితే..కాసుల వర్షం కురుస్తుంది.  తాజాగా బూతు కంటెంట్ సినిమాలపై  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Image result for vise president venkaiah naidu
విజయా వాహినీ స్టూడియోస్ అధినేత, విజయ హెల్త్ సెంటర్ స్థాపకులు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సేవలకు గుర్తుగా కేంద్రం రూపొందించిన తపాలా బిళ్లను చెన్నైలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.  ఈనెల 25న నాగిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని విజయ హెల్త్ సెంటర్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, సీఈవో భారతీరెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. సినిమాల్లో అశ్లీలం, బూతు, హింసను విడిచిపెట్టి భారతీయతను, మన సంస్కృతీసంప్రదాయాలను భావితరాలకు అందించే సందేశాత్మక సినిమాలు తీయాలని దర్శక నిర్మాతలకు పిలుపునిచ్చారు.
Image result for movie reel
నాగిరెడ్డి గొప్ప మానవతావాదని కొనియాడారు. ఆయన సినిమాల్లో గొప్ప సందేశం ఉంటుందని, అందరికీ ఆమోదయోగ్యమైన శృంగారం ఉంటుందని అన్నారు. ఇప్పటి సినిమాల్లో శృంగారం తక్కువ, అంగారం ఎక్కువ అయిందని అన్నారు. హింస, బూతు, అశ్లీలాన్ని భావితరాలకు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమానికి హాజరైన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ‘నాగిరెడ్డి-ద లెజెండ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘మహానటి’ సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, రావి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: