అతిలోక సుందరి శ్రీదేవి తన గారాల పట్టి 'జాహ్నవి' పుట్టిన రోజు పది పన్నెండు రోజులుందనగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మార్చి 6నాడు జాహ్నవి తన 21 వ పుట్టిన రోజు తల్లి లేకుండా జరుపుకోబోతుంది. శ్రీదేవి జీవితంలో జాహ్నవి మొదటి సంతానం కావడం, అందునా ఆడపిల్ల కావడంతో శ్రీదేవికి ముందు నుంచి అమితమైన ప్రేమ ప్రత్యేకం స్థానం.
శ్రీదేవి ఎక్కడికెళ్లినా తన కూతురు జాహ్నవిని వెంటబెట్టుకొని వెళ్లేది. తల్లికూతుళ్ల మాదిరిగా కాకుండా మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇంతటి సాన్నిహిత్యం ఉన్న తల్లికూతుళ్లు బాలీవుడ్లో కూడా చాలా అరుదు. కూతురితో దిగే ఫొటోలను ఎప్పటికప్పుడు 'ఇన్స్టాగ్రాం' లో పోస్టు చేసుకునేది.
నిజానికి జాహ్నవి సినిమాల్లోకి రావడం శ్రీదేవికి ఇష్టం లేదు. మరేదైనా కెరీర్ ఎంచుకోవాలని కోరుకునేది. అయితే జాహ్నవికి సినీరంగంపై అమితమైన ఆసక్తి ఉండడంతో కాదనలేకపోయింది. తల్లిగా కూతుర్ని సమర్థించడం తన బాధ్యత అని పలుసార్లు సన్నిహితులతో చెప్పుకునేది.
అందుకే జాహ్నవి 'డెబ్యూ' సినిమా 'ధడక్' పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంది. ఈ సినిమా జులై 20 విడుదల కాబోతోంది. ఈ సినిమా భాధ్యతలన్నీ కరణ్ జోహార్ తన భుజస్కందాలపై వేసుకున్నాడు. దురదృష్టవశాత్తు తన కూతురు మొట్ట మొదటి సినిమాను కూడా చూడకుండానే శ్రీదేవి తుదిశ్వాస విడిచింది.
మరోవైపు కిందటి ఏడు జాహ్నవి పుట్టిన రోజు నాడు జాహ్నవి చిన్ననాటి ఫొటోలను శ్రీదేవి 'ఇన్స్టాగ్రాం' లో పోస్టు చేసింది. ఈసారి హిరోయిన్ గా క్రేజ్ సంపాదించింది కాబట్టి జాహ్నవి పుట్టినరోజును గ్రాండ్ గా “బాలీవుడ్ సెలెబ్స్” మద్యలో కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేట్ చేయాలని శ్రీదేవి ప్లాన్ చేసి ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. కానీ ఆలోపే బాలీవుడ్ చాందినీ తీరని లోకాలకు వెళ్లిపోయింది.
ఇప్పుడిప్పుడే తల్లి జ్ఞాపకాలు నుంచి కోలుకుంటున్న జాహ్నవికి ఈ పుట్టినరోజున శ్రీదేవి అనుకున్నట్లుగానే గ్రాండ్ గా ఏర్పాటు చేసి, జాహ్నవిని సంతోషంగా వుంచాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట. ఇలాగైనా తల్లి ఙ్జాపకాల నుండి కొంతైనా బయటకు వచ్చేందుకు రొటీన్ లైఫ్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు బాలీవుడ్ తారలు ఇప్పటికీ బోనీ కపూర్ ఇంటికి వెళ్లి బోనీ, జాహ్నవి, ఖుషీలకు సాను భూతి తెలుపుతున్నారు. అయితే పుట్టిన రోజున ఎవరూ జాహ్నవికి సాను భూతి తెలపకుండా వుండేలా బోనీతో పాటు కుటుంబ సభ్యులంతా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అర్జున్, అన్షులా కూడా ఈ బర్త్ డే పార్టీని విజయవంతం చేసేలాగా ప్రయ త్నాలే కాకుండా పాల్గోబోతున్నారు.
మరోపక్క ఆమె కుటుంబానికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జాహ్నవి పెళ్లి విషయం గురించి గతంలో కుటుంబంలో చర్చ జరిగి నట్లు వార్తలొచ్చాయి. దగ్గరి బంధువులు, దేశంలో కుబేరుల్లో ఒకరైన అనీల్ అంబానీ కుమారుడితో జాహ్నవి పెళ్లి నిశ్చయించారట. ఒకవేళ సినిమా కెరీర్ లో జాహ్నవి సక్పెస్ కాకపోతే వెంటనే అనీల్ అంబానీ తనయుడితో వివాహం జరిపించి గ్రేట్ బిజినెస్ మెన్ కోడలిగా చూడాలని శ్రీదేవి తన సన్నిహితులతో చెప్పేదని బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు.
Anil Ambani & wife Tina Ambani with son Jai Anmol Ambani
అయితే శ్రీదేవి కి అంబానీ ఇచ్చిన మాట ప్రకారం శ్రీదేవి కూతరికి తన కొడుకునిచ్చి పెళ్లి చేయటంలో ఎలాంటి సందేహం లేదని బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు. అయితే తల్లి పోయిన దుఖంలో ఉన్న జాహ్నవి పెళ్లి పై ఆసక్తి చూపిస్తుందా? లేదా? అని అందరు ఆసక్తి చూపిస్తున్నారు. మెత్తానికి బాలీవుడ్ మొత్తం ఇదే విషయంపై చర్చ సాగుతుంది.