భారీ అంచనాల మధ్య మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ సెకండ్ షెడ్యూల్ ఈనెల 23 నుంచి ప్రారంభం కాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ లో నయనతార తో పాటు అమితాబచన్ కూడ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ‘సైరా’ కు సంబంధించి జరుగుతున్న షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ కు కొనసాగింపు మాత్రమే అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చిత్రీకరించిన సన్నివేశాలలో చిరంజీవి సంతృప్తి చెందని సన్నీ వేశాలను తిరిగి చిత్రీకరిస్తున్నారు.
CHIRANGEEVI SAIRA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి ఇక ఎటువంటి లీకులు బయటకు రాకూడదని చిరంజీవి తన పిఆర్ టీమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షెడ్యూల్స్ అస్తవ్యస్థంగా తయారవ్వడంతో పాటు ఈ సినిమాపై హైప్ పెంచడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు అని తెలుస్తోంది. 
CHIRANGEEVI SAIRA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు ఈమూవీ షూటింగ్ డిటైల్స్ బయటకు లీక్ కావడంతో అభిమానుల తాకిడి షూటింగ్ స్పాట్ వద్ద విపరీతంగా పెరిగి పోవడంతో చిరంజీవి తన నటన పై ఏకాగ్రతను ప్రదర్శించ లేకపోతున్నాడు అన్న అభిప్రాయంలో ఉన్నట్లు టాక్. దీనితో ఇక నుంచి ఈమూవీ షూటింగ్ ను చాల రహస్యంగా కొనసాగించాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
VVVINAYAK LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థుతుల మధ్య లేటెస్ట్ గా ‘సైరా’ సెట్స్ పై దర్శకుడు వినాయక్ తరుచూ కనిపిస్తున్న నేపధ్యంలో దర్శకుడు సురేంద్ర రెడ్డికి సలహాలు ఇచ్చే సహాయకుడుగా వినాయక్ వ్యవహరిస్తున్నాడా అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి హైదరాబాద్ చివరి ప్రాంతాలలో రెండు భారీ సెట్లు నిర్మించడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈసినిమాలో వాడే ఆయుధాల డిజైన్ కు సంబంధించి ఒక స్పెషల్ టీమ్ పనిచేస్తోంది అని తెలుస్తోంది. త్వరలో కేరళ ఆతరువాత చైనా వెళ్ళబోతున్న ఈమూవీ షూటింగ్ విషయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా చిరంజీవి తీసుకుంటున్న జాగ్రత్తలు హాట్ న్యూస్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: