మల్టీస్టారర్ సినిమాలు టాలీవుడ్ కు కొత్తేమీ కాదు. సంచలనాలకు అంతు లేదు. అయితే కాంబో, స్టైల్, బేస్డ్ స్టొరీలు ఈ సినిమాలకు అవసరం. అయితే సందర్భం ఎమంటే కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబొ మూవి అనగానే కనుబొమ్మలు ఎగరేసి వినే ఉత్సాహం కలుగుతుంది. ఇద్దరికి అభిమానులు ప్రత్యేకం. నాగార్జున అభిమానులు మన్మధుడు లాంటి ఫామిలీ డ్రామా ఇష్టపడతారు. అలాగే నాని అభిమానులు కామెడి ఫిల్ల్డ్ ఎంటర్టైనెర్ అంటే మక్కువ చూపుతారు. ఇద్దరు ఉత్తమ నటులే ఉన్నత నటులే. ఇంకేం ఇద్దరు కలిస్తే సినిమాలో నవరసాలు పండిస్తారు.
నిన్న ఉగాది పర్వదినాన వైజయంతీ మూవీస్ బానర్ పై చలసాని అశ్వినిదత్ నిర్మాణ సారధ్యంలో శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అభిమాన ప్రేక్షకులకు ఉగాది పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ షూటింగ్ ప్రారంభించింది.
ఈ సినిమా కథ "ఫన్ ఫిల్ల్డ్ కామెడీ థ్రిల్లర్" గా చెప్పుతున్నారు దర్శకుడు. ఇద్దరు నటులను సమానంగా ఇంప్రెస్ చేసిన కథ అని అనటంలోనే ప్రేక్షకుల్లో ఉత్సుకత ఇప్పటికే తారస్థాయికిచెరింది.
దర్శకుని మాటల ప్రకారం నాని లోని 'కామెడీ కోణాన్ని పూర్తిగా పిండేసి' తన గత చిత్రాలు భలే మంచి రోజు, శమతకమణి అనుభవాన్ని రంగరించి నానిని ఒక అద్భుత నవరస నటునిగా "పోట్రే" ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక నాగార్జున పాత్రను గురించి "సీక్రెట్" గా ఉంచుతున్నారు. నవంబర్ - డిసెంబర్లో సెట్స్ మీద స్పీడ్ అందుకోనున్న ఈ సినిమాపై ఎక్స్-పెక్టేషన్లు ఇప్పటికే మిన్నునంటుతున్నాయి. మొత్తం మీద అనేక రకాల ' చిలిపి అల్లర్లతో నవ్వులు' పండించే రసవత్తర హాస్య స్పోరక సినిమా కావచ్చు అంటున్నారు. నాగర్జున కూడా హాస్యం పండించటంలో మహా మహా నటుడే కదా!
ఇంకేం వీరి కాంబో మనకొక అద్భుతమైన హాస్యరస దృశ్య కావ్యాన్ని కను విందుగా పసందుగా ఉండబోతున్నట్లుంది.