‘ఉగాది’ పండుగరోజున విశాఖపట్నంలో వేలాదిమంది మెగా అభిమానుల మధ్య అత్యంత వేడుకగా ‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చరణ్ కు బాసటగా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన చిరంజీవి తన స్పీచ్ లో అనుకోకుండా ‘రంగస్థలం’ క్లైమాక్స్ సీన్ ను బయటపెట్టి ఇప్పటి వరకు ఈ సినిమా పై ఉన్న సస్పెన్స్ ను అందరిలో పోగొట్టాడు. 
తెలంగాణ బిడ్డ అయినా.. గోదావరి
వాస్తవానికి ఈమూవీ ట్రైలర్ లో దర్శకుడు సుకుమార్ కథను  చూచాయగా చెప్పేసినా అసలైన ట్విస్ట్ ఏంటో రివీల్ చేయకుండా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.  ప్రెసిడెంట్ జగపతి బాబుతో పోటీకి దిగిన కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టికి అండగా నిలబడే అతని తమ్ముడు  చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ తన అన్నను గ్రామ ప్రెసిడెంట్ గా ఎలా చేసాడు అన్న విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచారు.   
వైజాగ్‌లో అదే ఉత్సాహం
అయితే ఈ కథ ఎలా క్లైమాక్స్ కు చేరుకుంటుంది అనే దాని మీద మాత్రం కొన్ని సందేహాలు ఉన్నాయి. ఫంక్షన్ చివర్లో మాట్లాడిన చిరంజీవి చరణ్ గురించి పుత్రోత్సాహంతో చెబుతూ ఆది పినిశెట్టి పాత్ర చనిపోతుంది అని చెప్పేయడంతో చిరంజీవి పక్కన నుంచుని ఉన్న సుకుమార్ ఫేస్ లో చిన్న షాక్ కనిపించింది.  వాస్తవానికి చిరంజీవి కావాలని ఈమూవీ సస్పెన్స్ ను చెప్పకపోయినా చరణ్ ఎమోషనల్ గా ఎంత అద్భుతంగా నటించాడో చెపుతూ అందులో కీలకమైన ఆది డెత్ ఎపిసోడ్ ను చిరంజీవి బయట పెట్టడంతో ఈ మూవీ క్లైమాక్స్ అందరికీ తెలిసిపోయింది. 
Rangasthalam Pre Release Event Set 5 Photos
చిరంజీవి ఉద్వేగంగా చేసిన ప్రసంగంలో ఒకసారి కాదు రెండు సార్లు ప్రెసిడెంట్ కు పోటీగా దిగిన కుమార్ బాబు అలియాస్ ఆది పినిశెట్టిని ప్రత్యర్థులు చంపేస్తారు అని చెప్పడం సుకుమార్ కు ఒక్క క్షణం షాకింగ్ గా మారింది. చిరు అనుకోకుండా తన్మయత్వంలో ఇలా సస్పెన్స్ ను ముందే బయటపెట్టిన నేపధ్యంలో ఈమూవీ గురించి మెగా అభిమానులు ఊహించుకుంటున్న రకరకాల ఊహలకు బ్రేక్ పడింది అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: