తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్.  బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ మద్య మనం చిత్రంలో క్లయిమాక్స్ లో కనిపించాడు.  ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ చిత్రం అనుకున్న విజయం సాధించలేక పోయింది.  మనం లాంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంతో కాస్త పరవాలేదు అనిపించుకున్నా కమర్షియల్ గా మాత్రం విజయం పొందలేక పోయింది. 

తాజాగా హీరో అఖిల్ తన తదుపరి సినిమా వివరాలను ట్విట్టర్ వేదికగా ఉగాది పర్వదినాన ఈ రోజు స్వయంగా ప్రకటించాడు. 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. "ఆదివారాలు చాలా లవ్లీగా ఉంటాయి కదూ! ఈ లవ్లీ ఆదివారం నా కొత్త సినిమా ప్రాజెక్టు వివరాలను వెల్లడించాలనుకుంటున్నాను. వెంకీ అట్లూరి నా కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మేలో చిత్రీకరణ మొదలవుతుంది.
Related image
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత" అని అఖిల్ ట్వీట్ చేశాడు.తన మూడో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి తీసిన తొలిప్రేమ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్న విషయం తెలిసిందే.   గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమేనంటూ అఖిల్ తాజాగా చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: