అలనాటి మేటి హీరోయిన్ సావిత్రి బయోపిక్. ఈ సినిమాను ఓ మాంచి క్లాసిక్ గా తీయాలని, చూసే ప్రేక్షకులకు సర్ప్రయిజ్ గా వుండాలని నిర్మాత స్వప్నదత్ తదితరుల కోరిక. అందుకే ఈ సినిమా విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `మహానటి`. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తుండగా.. సమంత మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో సమంత ప్రముఖ నటి జమునగా కనిపించబోతోందనే వార్తలు గతంలో వినిపించాయి. కానీ ఈ పాత్ర పోషిస్తున్నది శాలిని పాండే అని తాజా సామాచారం.
చిత్ర యూనిట్ అఫీషియల్గా వెల్లడించిన వివరాల ప్రకారం సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్తో 'మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఓ జర్నలిస్ట్ మహానటి కథను రాయడం లేదా నెరేట్ చేయడం అనే స్టయిల్ లో కథ సాగుతుందన్నమాట.
అయితే సమంత ఆ క్యారెక్టర్ వేస్తోంది కాబట్టి, కథ మధ్యమధ్యలో అసలు కథకు పాజ్ ఇచ్చి, ఆమెను అలా అలా చూపిస్తుంటారన్నమాట. వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ విడుదల కానుంది.