బాలీవుడ్ ఇండస్ట్రీలో 80, 90 దశకాల్లో మాధురీదీక్షిత్ ఎంత క్రేజ్ ఉన్న హీరోయినో అందరికీ తెలిసిందే. అప్పట్లో నెంబర్ వన్ గా వెలిగిపోతున్న శ్రీదేవి లాంటి హీరోయిన్ కి ధీటుగా డ్యాన్స్, పర్ఫామెన్స్ తో దుమ్మురేపింది. ఇక మాధురీ డ్యాన్స్ అంటే అప్పట్లో కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేవారు. తేజాబ్ చిత్రంలో ఏక్, దో, తీన్ పాట ఇప్పటికీ సెన్సేషన్ అనే చెప్పొచ్చు.
ఈ పాటకు ప్రేక్షకులు చిత్తయిపోయారంటే అతిశయోక్తి కాదు..అలాంటి గొప్ప సాంగ్ ఇప్పుడు ‘బాగీ 2’ చిత్రంలో రిమేక్ చేశారు. ఈ పాటపై గ్లామర్ క్వీన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ సెప్పుులు వేశారు. ఈ మద్య రిమేక్ సాంగ్స్ పెద్దగా హిట్ కావడం లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు లో చిరంజీవి పాటలను రామ్చరణ్, సాయి ధరమ్ తేజ్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అలాంటి క్లాసిక్స్ని రీమిక్స్ చేసి భ్రష్టు పట్టించకుండా ఉండటమే మంచిదని సినీ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక 1990లలో 'తేజాబ్' చిత్రంలో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసి ఆడిపాడిన 'ఏక్ దో తీన్' సాంగ్ నాడు సంచలు సృష్టించింది. 'తేజాబ్'కి రీమేక్గా తెలుగులో దాసరి నారాయణరావు వెంకటేష్, రాధ జంటగా 'టూ టౌన్ రౌడీ'గా రూపొందించి అందులో 'ఏక్ దో తీన్' పాట బాణీని కాపీ కొట్టి రాధపై చిత్రీకరించినా కూడా ఆ పాట హిట్ కాలేదు.
ఇక విషయానికి వస్తే మరలా ఇంత కాలానికి బాలీవుడ్లో మరోసారి 'ఏక్ దో తీన్' అనే పాటను రీమిక్స్ చేశారు. ఈ చిత్రం సాంగ్ టీజర్ని చూసినప్పుడే అందరికీ తేడా కొట్టింది. ఏక్ దో తీన్ రీమేక్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ పాటకు జాక్వెలిన్ చెత్తగా డ్యాన్స్ చేసిందని సోషల్మీడియాలో మాధురీదీక్షిత్ అభిమానులు మండిపడుతున్నారు.
తేజాబ్ డైరెక్టర్ చంద్ర కూడా ఈ రీమిక్స్ పాటపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. అంతే కాదు శ్రీదేవి సంతాపసభకు వెళ్లినపుడు కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ తనకు రీమిక్స్ సాంగ్ విషయం చెప్పిందని చంద్ర తెలిపాడు. ఈ పాటపై తాను, సరోజ్ఖాన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్ర తెలిపాడు. మాధురీదీక్షిత్, జాక్వెలిన్ సాంగ్స్పై మీరూ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=MS5BLS2sIDM