తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘బద్రి’ చిత్రంలో హీరోగా నటించాడు పవన్ కళ్యాన్. పవన్ సరసన రేణు దేశాయ్, అమిషా పటేల్ నటించారు. బద్రి షూటింగ్ సమయంలోనే రేణు దేశాయ్, పవన్ కళ్యాన్ మద్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరిద్దరు తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అయితే ఈ జంటకు ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆధ్యలు పుట్టారు.
విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ పూణేలో ఉంటున్నారు. పవన్, రేణూ కలిసి జీవించకపోయిన తాను ఏప్పటికపుడు వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి అండగా ఉంటున్నారు అనే సమాచారం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాన్ కి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికితలెసిందే. కాగా, ఈరోజు అతడి కుమార్తె ఆద్య ఏనిమిదో పుట్టిన రోజు.. దీంత కుమార్తె పుట్టిన రోజు జరిపేందుకు ప్రస్తుతం తల్లి వద్ద పూణేలో ఉంటున్న ఆద్య కలిసేందుకు అక్కడికి వెళ్లాడు పవన్. ఈరోజు కుమార్తె తో గడిపి తిరిగి హైదరాబాద్ కు రానున్నాడు.
మార్చ్ 23 పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ల కూతురు అయిన ఆద్య పుట్టినరోజు కావడంతో క్రిందటి ఏడాది పవన్ కళ్యాణ్ పూణేకి వెళ్లి కూతురితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. తాజాగా ఈ పిక్ నేడు ఆద్య బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో మళ్లీ వైరల్ అవుతోంది.