టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో వారసత్వ హీరోయిన్ రంగప్రవేశానికి నేడు శ్రీకారం చుట్టబడింది హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు శివానీని హీరోయిన్‌ గా పరిచయం చేస్తూ '2 స్టేట్స్' మూవీ ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈమూవీ హిందీలో హిట్టయిన ‘2 స్టేట్స్’ చిత్రనికి తెలుగులో రీమేక్ గా రాబోతోంది  ప్రముఖ నటుడు కృష్ణంరాజు దర్శకుడు రాఘవేంద్రరావు  డైరెక్టర్ రాజ‌మౌళి అతిధులుగా వచ్చిన ఈ కార్యక్రమం నేడు ఎంతో వేడుకగా జరిగింది.  
వెంకట్ కుంచ‌ దర్శకుడిగా
తొలిసన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టగా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జీవిత రాజశేఖర్ దంపతులకు అత్యంత ఆప్తులైన కృష్ణంరాజు తన భార్యతో కలిసి వచ్చి శివానీని ఆశీర్వదించడం ఈకార్యక్రమానికి హైలెట్. వెంకట్ కుంచ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ రచియిత చేతన్  భగత్ రాసిన నవల ఆధారంగా హిందీ లో  ‘2 స్టేట్స్' తీసారు.  
లక్ష్య ప్రొడక్షన్స్
ఇప్పుడు ఈమూవీ కధకు మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తీస్తున్నారు. ఈ చిత్రంలో శివానీ తల్లి పాత్రలో నటించడానికి బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, తండ్రి పాత్రలో రజత్ కపూర్‌ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కృష్ణం రాజు, రాఘవేంద్రావు, రాజమౌళి
ఇప్పటివరకు హీరోల కుటుంబం నుండి వచ్చిన మంచులక్ష్మి నిహారిక అదేవిధంగా వీళ్లిద్దరి కంటే ముందు నటనలో అదృష్టాన్ని పరీక్షించుకున్న సూపర్ స్టార్ కుమార్తె మంజుల అక్కినేని నాగేశ్వరరావు మనమరాలు సుప్రియ లాంటి వాళ్ళు అందరు హీరోయిన్స్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేక పోయారు. ఈ నేపధ్యంలో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాని ఈ సెంటిమెంట్ ను ఎంత వరకు బ్రేక్ చేస్తుందో చూడాలి. అడ‌వి శేషు న‌టించిన ‘క్ష‌ణం' చితం తరువాత అతడి నుంచి కూడ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ మూవీ లేదు. ఈ పరిస్థితులలో ఈ ప్రయోగం ఎంతవరకు సక్సస్స్ అవుతుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: