నితిన్ లేటెస్ట్ సినిమా ఛల్ మోహన్ రంగ. నితిన్ చివరి సినిమా లై డిజాస్టర్ తర్వాత వెంటనే ఆ సినిమాలో తనకు జోడీ హీరోయిన్ అయిన మేఘా ఆకాష్తో వెంటనే జోడీ కట్టి ఈ సినిమా చేశాడు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నితిన్కు వీరాభిమాని అయిన పవన్కళ్యాణ్, ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ శ్రేష్ట్ మూవీస్ ఈ మూడు బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. నితిన్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు మెయిన్ కథ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఫస్ట్ షో టాక్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ? చూద్దాం.
సినిమా ఫస్టాఫ్ అమెరికా నేపథ్యంలో సాగుతుంది. నితిన్ - మేఘా ఆకాష్ మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ బాగున్నాయి. త్రివిక్రమ్ ఇచ్చిన మెయిన్ లైన్కు దర్శకుడు కృష్ణ చైతన్య ఫుల్ స్క్రిఫ్ట్ బాగా సెట్ చేసుకుని సినిమా తెరకెక్కించాడు. సినిమా కూల్ ఎంటర్టైనర్. యూఎస్లో సాగే కథలో హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రభాస్ - మధునందన్ మధ్య కామెడీ సీన్లు కూడా బాగున్నాయి. ఇక అనుకోని కారణంగా మేఘా ఆకాష్ నితిన్ దూరమవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకి ప్లస్ పాయింట్.
లై సినిమాలో కన్నా నితిన్, మేఘా ఆకాష్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయ్యింది. దర్శకుడు యూత్ను మెప్పించే సీన్లు బాగా రాసుకున్నాడు. రొమాంటిక్ పైర్గా స్క్రీన్పై నితిన్ - మేఘా జంట నటన అలరిస్తుంది. సినిమాలో కొన్ని సర్ప్రైజెస్ సీన్లు ఉన్నాయి. అయితే సెకండాఫ్లో మాత్రం సినిమా కాస్త అంచనాలకు తగ్గింది. ఇండియాలో జరిగే సెకండాఫ్లో నితిన్తో బ్రేకప్ అవ్వడంతో మేఘా ఇక్కడకు వచ్చేస్తుంది. నితిన్ కూడా ఆమె కోసం ఇక్కడకు వస్తాడు.
ఈ కథ నేపథ్యంలో కథ బాగానే ఉన్నా సెకండాఫ్లో కొన్ని సీన్లు అనుకున్నట్టుగా పండలేదు. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను బాగా లేపాయి. సినిమా 148 నిమిషాల రన్ టైం కాబట్టి సినిమా అలరించింది. నితిన్ అకౌంట్ ఛల్ మోహన్ రంగ మంచి ఫలితం ఇస్తుందని చెప్పొచ్చు. యూత్ను మెప్పించే క్లాస్ సినిమాగా నితిన్ ఛల్ మోహన్ రంగ నిలుస్తుంది.