ఈ మద్య టాలీవుడ్ లో సినీ తారలపై బయోపిక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అలనాటి అందాల తార..తన హావభావాలతో..కంటిచూపుతోనే ఎన్నో ఎక్స్ ప్రెషన్స్ చూపించగల మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని మహానటి సినిమా తెరకెక్కిస్తున్నారు. సావిత్రిగా మళియాళ బ్యూటి కీర్తి సురేష్ నటిస్తుంది. ఇతరు ముఖ్యపాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే,మోహన్ బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.
ఇక మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ కూడా తీస్తున్నారు. తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఆయన సతీమణి బసవతారకం పాత్రకిగాను విద్యాబాలన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో జయలలిత పాత్ర కూడా ఉంటుందనీ, ఆ పాత్రను కాజల్ చేయనుందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే కాజల్ ఈ మద్య ఎక్కువ శాతం గ్లామర్ తరహా పాత్రల్లో నటిస్తుంది..ప్రయోగాత్మ చిత్రాల్లో తాను నటించలేని..అంత ధైర్యం చేయలేనిన ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఎన్టీఆర్ బయోపిక్ లో జయలలిత పాత్రలో కాజల్ కనిపిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఈ అమ్మడు "ఈ సినిమా కోసం ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు .. ఈ సినిమాలో నేను నటించడం లేదు.
ఇదంతా కేవలం పుకారు మాత్రమే .. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు" అంటూ ఆమె స్పష్టం చేశారు. అలనాటి జానపద, సాంఘిక సినిమాల్లో ఎన్టీఆర్ తో కలిసి జయలలిత నటించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వీరు అప్పుడప్పుడు కలిసేవారని తెలిసిన విషయమే. అలాంటి జయలలిత పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి.