తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో సమానంగా పోటా పోటీగా నటించి మెప్పించారు మహానటి సావిత్రి.  ఎన్నో అద్భుతమైన పాత్రల్లో జీవించిన ఆమె సహజన నటిగా..కేవలం తన కళ్లతోనే హావభావాలు పలికించగల గొప్ప నటిగా కీర్తించబడింది. అయితే ఎంతో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారో..చివరి దశలో అంత దీనస్థితి అనుభవించారు. అయితే మహానటి సావిత్రి జీవిత కథపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
Image result for savitri ntr anr
సమంత, విజయ్ దేవరకొండ, షాలినీ పాండే మొదలగువారితో పాటు మహామహులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. అయితే సావిత్రిగారు ఓ బాబుని ఎత్తుకుని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘వెలుగు నీడలు’ చిత్రం లో కింగ్ నాగార్జున బాలనటుడిగా నటించారు.  ఆ సమయంలో సావిత్రి నాగార్జునని సావిత్రమ్మ ఎత్తుకుని జోలపాడుతున్న ఫొటోని ఓ నెటిజన్ నాగార్జునకు షేర్ చేశాడు. ఈ ఫొటో షేర్ చేసిన నెటిజన్‌కి థ్యాంక్స్ చెబుతూ.. ఈ ఫొటో వెలుగు నీడలు అనే చిత్రంలోనిది అంటూ నాగార్జున తన మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. అంతకుముందు మహానటి టీజర్‌పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: