గత కొంత కాలంగా టాలీవుడ్ లో రక రకాల విషయాల్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ఆ మద్య డ్రగ్స్ కేసు మొదలు నిన్న మొన్నటి వరకు శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయం దాకా..ప్రతిరోజూ టాలీవుడ్ నేపథ్యంలో ఎన్నో వార్తలు వచ్చాయి..వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ కి సంబంధించిన కొత్త న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

వేతనాలు పెంచాలని లైట్‌మెన్ల మెరుపు సమ్మెకు దిగారు. దాంతో టాలీవుడ్‌లో పలు సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. తమ సమస్య పరిష్కారం కోసం వారు పలు డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడున్న జీతం కంటే 35 శాతం వేతనాలు పెంచాలని లైట్‌మెన్లు కోరుతున్నారు.

అయితే దీనిపై స్పందించిన నిర్మాతలు 25 శాతం పెంచడానికి అంగీకారం తెలిపారు. దీంతో ‘మా’ నిర్మాతలు ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ మా ను ఆశ్రయించారు.  వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరించడాకిని కృషి చేస్తామన్నారు. కాగా ఆ మద్య కూడా టాలీవుడ్ థియేటర్ల బంద్ కి పిలుపునిచ్చన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: