ఈసమ్మర్ రేస్ కు విడుదలైన చరణ్ మహేష్ ల సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారడంతో ప్రస్తుతం ‘నాపేరు సూర్య’ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. గత సంవత్సరం అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ అనుకున్న స్థాయిలో విజయవంతం కాని నేపధ్యంలో ఈ ఏడాది సమ్మర్ రేస్ లో ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టవలసిన ఒత్తిడి బన్నీ పై విపరీతంగా ఉంది. 
NAAPER SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమా విడుదలకు ఇక కేవలం పది రోజులు మాత్రమే మిగిలిఉన్నా ఈమూవీ ప్రమోషన్ విషయంలో అశ్రద్ధ కనపడుతోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికికారణం ఈసినిమాకు నిర్మాతలుగా ముగ్గురు వ్యవహరించడం అని అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాకు నిర్మాత లగడపాటి శ్రీధర్. 
NAAPER SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఆతరువాత ఈసినిమాకు నిర్మాతలుగా నాగబాబు బన్నీ వాసులు వచ్చి చేరారు. తెలుస్తున్న సమాచారంమేరకు బన్నీకి ఈసినిమాలో షేర్ ఉన్ననేపధ్యంలో ఆ విషయాలను బన్నీ వాస్ చూస్తున్నాడని టాక్. ఇప్పుడు ముగ్గురు ఈసినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పబ్లిసిటీ విషయంలో ఈముగ్గురి మధ్య బయటపడని భేదాభిప్రాయాలు వచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
సామాన్యంగా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ సినిమాలకు సాధారణంగా పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. కానీ లగడపాటి శ్రీధర్ పబ్లిసిటీ విషయంలో ఖర్చు రీత్యా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితో గీతా ఆర్ట్స్ పీఆర్వో లు వేరు లగడపాటి శ్రీధర్ పిఆర్వోలు వేరు కావడంతో వీరిద్దరి మధ్య ఒక అంగీకారం చాల విషయాలలో కుదరడం లేదు అని వార్తలు గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. దీనితో పరిస్థితి గ్రహించిన అల్లు అరవింద్ రంగప్రవేశం చేసి సమస్యల పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఈసినిమా పాటలకు స్పందన అంతగా లేనినేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను భారీ స్థాయిలో చేయకపోతే కలక్షన్స్ విషయంలో ‘నాపేరు సూర్య’ కు తీవ్ర సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: