తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్ ’ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. సెక్సీ లుక్స్ తో మత్తెక్కించే మాటలతో కుర్రకారు మనసు దోచిన అనసూయ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. బుల్లితెరపై హాట్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర మీద కూడా తన సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన `రంగస్థలం` సినిమా ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అద్భుతంగా నటించింది.
తాజాగా అనసూయకు మరో మంచి అవకాశం వచ్చినట్టు సమాచారం. వినోదభరిత కథాంశంతో అనీల్ రావిపూడి ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, వెంకటేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎఫ్2 అనే టైటిల్ పెట్టారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో అనసూయ కోసం స్పెషల్ రోల్ క్రియేట్ చేశాడట అనీల్ రావిపూడి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో అనసూయను కీలక పాత్రకు తీసుకున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. ఈ మెగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ మే నుండి సెట్స్ పైకి వెళ్లనుండగా, త్వరలోనే అనసూయ పాత్రకి సంబంధించి క్లారిటీ రానుంది. ఇక కథానాయికగా వరుస సక్సెస్లతో దూసుకెళుతున్నమెహరీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుండగా, మరో హీరోయిన్ విషయంలో క్లారిటీ రావలసి ఉంది.
ఇదిలా ఉంటే ఈమధ్య చేస్తున టీవీ షోలు trp రేటింగ్లు పూర్తిగా పెరగడంతో పాటు ఆమె నటించిన సినిమాలు కూడా హిట్స్ అందుకోవడంతో క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అనే ఉద్దెశంతో అనసూయ పారితోషకాన్ని మూడు రేట్లు పెంచేసింది అని వార్తలు వస్తున్నాయి. గతంలో ఒక టీవీ షోలో వాక్యతగా తన కెరీర్ ప్రారంభించింది.
ప్రేక్షకులలో ఆమెకి క్రేజ్ ఒకసారి పెరిగిపోవడంతో ఇప్పుడు ఆమె ఒక పక్క దాదాపు అన్ని టీవీ లలో యాంకర్ గా దుమ్ములేపుతు మరో పక్క సినిమాలలో కూడా మంచి మంచి ఆఫర్స్ చేజికించుకుంటూ దూసుకుపోతుంది.