త్రివిక్రమ్ జూనియర్ కాంబినేషన్ లో ప్రారంభం అయిన మూవీలో ఎవరు ఊహించని ఒక భారీ మార్పు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాటల మంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ సినిమాలలో అతడు రాసిన డైలాగులకు విపరీతమైన ప్రాధాన్యత ఉండటమే కాకుండా ఆసినిమాను చూసే ప్రేక్షకులు తమ నిజ జీవితాలలో కూడా ఉపయోగించుకునేలా త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి.
సంబంధిత చిత్రం
అటువంటి త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీలో డైలాగ్ ల పార్టుకు సంబంధించి చాల భాగం ఒక కొత్త రచయిత కలం పై ఆధారపడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ జూనియర్ సినిమా కోసం పెంచల్ దాస్ అనే రైటర్ ను తీసుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన నాని ‘కృష్ణార్జున యుద్ధంలో 'దారి చూడు దుమ్ము చూడు మామ' అంటూ సాగే ఛార్ట్ బస్టర్ పాటను రాసిన రైటర్ ఇతనే. 
PENCHAL DAS LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు మాటలు మాంత్రికుడు తీయబోయే సినిమాలో ఎన్టీఆర్ పూర్తిగా చిత్తూరు జిల్లా యాసలో డైలాగులు చెప్పబోయే నేపధ్యంలో అక్కడి భాష యాస పై బాగా పట్టు ఉన్న పెంచల్ దాస్ ను తీసుకున్నట్లు టాక్. వాస్తవానికి చిత్తూరు జిల్లా యాస త్రివిక్రమ్ కు కొట్టిన పిండి. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కోట శ్రీనివాసరావుకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్ర అండ్ టీంకు చిత్తూరు యాసలోనే త్రివిక్రమ్ డైలాగులు వ్రాసాడు. అయితే ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తో షాక్ లో ఉన్న త్రివిక్రమ్ ఈసారి తన కలం పదును కన్నా ఎదుట వ్యక్తి మాటల మాయ పై ఆధారపడ్డాడనుకోవాలి. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా ఈమూవీ కథ పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా త్రివిక్రమ్ దీనిని ఫ్యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఈసినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తాడని కూడ తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కు ఏమాత్రం అలవాటులేని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథను జూనియర్ పై ప్రయోగించడంతో త్రివిక్రమ్  మరొకసారి సాహసం చేస్తున్నాడనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: