‘బాహుబలి’ తో ఇండియన్ టాప్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సాహో’ మూవీ బడ్జెట్ ను విపరీతంగా పెంచారు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలకు చేరుకుంది అని ప్రభాస్ స్వయంగా లీకులు ఇస్తున్నాడు అని వార్తలు రావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
prabhas saho movie latest photos కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి ప్రభాస్ ఒక అరబ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈలీకులు ఇచ్చాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ అరబ్ పత్రికకు దుబాయ్ మీడియా సర్కిల్స్ లో చాల మంచి పేరున్న నేపధ్యంలో ప్రభాస్ ఈమూవీ బడ్జెట్ గురించి వ్యూహాత్మకంగా ఇస్తున్న లీకులు వెనుక ఆంతర్యం ఏమిటీ అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 
సంబంధిత చిత్రం
ప్రస్తుతం అబుదాబిలో 250 మంది యూనిట్ సభ్యులతో భారీ స్థాయిలో ‘సాహో’ షూటింగ్ జరుగుతున్న నేపధ్యంలో అక్కడి అరబ్ మీడియాకు ఈ మూవీ షూటింగ్ వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం ఒక్క దుబాయ్ షెడ్యూల్ కోసమే 90 కోట్లు ఖర్చు అవుతున్నట్లు ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాల్గొన్న ఈసినిమా నిర్మాతలు చెప్పినట్లు సమాచారం. దీనితో దుబాయ్ చేరుకున్న తరువాత ‘సాహో’ బడ్జెట్ అదుపు తప్పిందా లేదంటే ఈలీకులు వెనుక మరేదైనా ఉద్దేశాలు ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. 

‘సాహో’ బడ్జెట్ పెంపుదల పై వస్తున్న వార్తలు విని ఇందాస్త్రీలోని మరికొందరు ఈ విషయం పై మరొక విధంగా స్పందిస్తున్నట్లు టాక్.  అబుదాబి ప్రభుత్వం తమ ప్రాంతంలో షూటింగ్స్ చేసే సినిమాలకు 30 శాతం రాయితీ ఇస్తుంది అన్న ప్రచారం ఉంది కాబట్టి ఆ రాయితీల కోసం ‘సాహో’ నిర్మాతలు ఇలా బడ్జెట్ పెంచి ఉంటారు అన్న గాసిప్పులు కూడ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా టీ సిరీస్ తో ఒప్పందం కుదుర్చుకొని దేశవ్యాప్తంగా ‘సాహో’ ను విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై భారీ అంచనాలు పెంచడం కోసం టీ సిరీస్ వ్యూహంలో భాగంగా ప్రభాస్ చేత ఇలాంటి లీకులు ఇప్పిస్తున్నారు అన్న ప్రచారం కూడ ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: