తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి.  ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన తర్వాత శ్రీరెడ్డికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అనూహ్యంగా పాపులారిటీ తెచ్చుకున్న శ్రీరెడ్డికి మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు కూడా లభించింది.  ఇక కాస్టింగ్ కౌచ్ పోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఆయన తల్లిగారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది. 
Image result for bharat ane nanu
ఆమెకు ఉన్న మద్దతు మొత్తం పోయింది..పైగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాంతో శ్రీరెడ్డిని మీడియా సైతం పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది.  వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనుంచి పవన్ పై అవాక్కులు చివాక్కులు పేలుతూ వస్తుంది శ్రీరెడ్డి.  నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి తనను టార్గెట్ చేసేవాళ్ల తాట తీస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి మరో సంచలనానికి నాంది పలికింది...కాకపోతే ఈ సారి మాత్రం పవన్ ఫ్యాన్స్ తో కాకుండా మహేష్ ఫ్యాన్స్ తో పెట్టుకుంది.
Sri Reddy
ఇప్పుడే భరత్ అనే నేను మూవీ చూసాను. అసలు ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఎంటిరా.. బిలో యావరేజ్‌ మూవీ. మహేష్ బాబు క్రేజ్‌ వల్ల హిట్ టాక్ వచ్చింది. లేకపోతే పక్కా ఫ్లాప్. వరెస్ట్‌ డైరెక్షన్‌, కంటెంట్ లేని కథ, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌ లేని యాక్టర్‌గా మహేష్ బాబుని తయారుచేస్తున్నారు’ అని ఆమె ఆ సినిమాపై తన రివ్యూ ఇచ్చింది. అంతే ఒక్కసారే మహేష్ ఫ్యాన్స్ అభిమానులు ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. దాంతో వెంటనే తన ట్విట్ ని డిలిట్ చేసింది శ్రీరెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: