నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు.  మహానటులు ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ఇప్పటికే 101 చిత్రాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కోసం రెడీ అవుతున్నారు.  ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే..టెంపర్ చిత్రం నుంచి వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.  ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాడు. 
Image result for kalyan ram na nuvve
ఇక ఎన్టీఆర్ సోదరుడు కళ్యాన్ రామ్ హీరోగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు.  ప్రస్తుతం జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం ‘నా నువ్వే’. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా వ్యవహరించారు. గొప్ప కెమెరామెన్ పీసీ శ్రీరామ్ తో కలిసి పనిచేసే అవకాశం రాదేమోనని అనుకున్నానని, కానీ, ఆ అవకాశం జయేంద్ర ద్వారా తనకు లభించిందని కల్యాణ్ రామ్ అన్నారు.‘ప్రేమకథా చిత్రాలు తీసే జయేంద్ర.. మాస్ చిత్రాలు చేసే నాతో సినిమా తీస్తారంటే మొదట్లో నమ్మలేదు...కానీ ఈ చిత్ర కథ చెప్పిన తర్వాత నిజంగా ఆశ్చర్యపోయానని అన్నారు.
Image result for kalyan ram na nuvve
ఎన్నో గొప్ప చిత్రాలకు కెమెరామెన్ గా వ్యవహరించిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం ఒక కలే అనుకున్నా.. అది సాధ్యమయ్యే పని కాదనుకున్నా. కానీ, నా కలను జయేంద్ర నిజం చేశారు’ అని కల్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ‘నా నువ్వే’ ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన తమన్నా నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: