గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న స్థాయి నుంచి బాడా బాబుల వరకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం..అత్యాచారం..హత్యలకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే..చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నా..చట్టం వారిని కఠినంగా శిక్షించకుండా సాధారణ జైలు శిక్షలు వేయడం పై పలువురు సెలబ్రెటీలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నేరస్తుడని సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ ఘటనపై స్పందించిన టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఆ వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మృగాడు కుల్దీప్ను వెంటనే చంపేయాలని ట్వీట్ చేశాడు.
అతడిని కోర్టు ఎంత త్వరగా శిక్షిస్తే..న్యాయం అంతబాగా జరిగినట్లు అని అన్నారు. అంతే కాదు మన సర్కారు ఒక్క రాత్రిలో కరెన్సీ నోట్లను మార్చేస్తోందని, అత్యాచార కేసుల్లో చట్టాలను మాత్రం మార్చట్లేదని మరో పోస్ట్ చేశాడు.