తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం ఉంది..చిన్న చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఆయన నట వారసులుగా ఇండస్ట్రీలో అరడజను మంది హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఏదో పేరు చెప్పుకొని ఫాలో కావడం కాకుండా తమ సొంత టాలెంట్ ఉపయోగించుకొని ఫ్యాన్స్ అభిమానం సంపాదించుకుంటున్నారు.
Image result for mega brothers
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలో ‘రాక్షసుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు మెగాబ్రదర్ నాగబాబు.  ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆయన నిర్మాణ రంగంలోకి వెళ్లారు.  ప్రస్తుతం జబర్ధస్త్ కామెడీ షోలో జడ్జీగా వ్యవహరిస్తూనే..సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.  ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు..చిరంజీవికి వచ్చినంత గొప్ప క్రేజ్ పవన్ కి వచ్చింది. అంతే కాదు ఇండస్ట్రీలో అంతగొప్ప మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్ ఒక్కరే.

ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అయితే ఈ ముగ్గురు హీరోలు ఇండస్ట్రీలో తమ టాలెంట్ తోనే పైకి వచ్చారని అందరికీ తెలిసిందే..నిన్నమదర్స్ డే సందర్భంగా  మెగా స్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు తమ తల్లి ఆశీస్సులు పొందారు. ‘మెగా’ బ్రదర్స్ తో పాటు ఇద్దరు సోదరీమణులు తమ తల్లి అంజనాదేవికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ‘మెగా’ బ్రదర్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తిరుమలలో ఉన్న విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: