ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా నాగ్ అశ్విన్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ‘మహానటి’ మూవీ సక్సస్ తో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి సూత్ర ప్రాయంగా చిరంజీవి అంగీకరించాడు అంటే ఈ యంగ్ డైరెక్టర్ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. ‘పాతాళభైరవి’ లాంటి గొప్ప ఫ్యాంటసీ కథ కావాలంటున్నాడు చిరంజీవి.
DIRECTOR NAG ASHWIN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే చిరంజీవి మాటలకు నాగ్ అశ్విన్ ఒకే చెప్పినా చిరంజీవిని ఒక కథతో ఒప్పించడం చాల కష్టమైన పని. ఇలాంటి పరిస్థుతులలో నాగ్ అశ్విన్ ప్రస్తుతం తనకు ఏర్పడిన క్రేజ్ రీత్యా కేవలం ఎప్పుడో ఇచ్చే చిరంజీవి డేట్స్ గురించి ఆలోచించకుండా హీరో నానీతో మరో సినిమాను తీయడానికి ప్రస్తుతం నానీతో ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 
DIRECTOR NAG ASHWIN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈకథ ‘ఎవడే సుబ్రమణ్యం’ కు సీక్వెల్ కాదు అని అంటున్నారు. నానీ ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ కథను నాగ్ అశ్విన్ నాని కోసం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో ఒక మల్టీ స్టారర్ చేస్తున్న నాని ఈమూవీ తరువాత నాగ్ అశ్విన్ సినిమాను వెంటనే లైన్ లో పెడతాడని టాక్. 
CHIRANJEEVI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
చిరంజీవి ‘సైరా’ సినిమాను చేస్తూనే తన తదుపరి సినిమా గురించి ఇప్పటి నుంచే ఆలోచనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ‘మహానటి’ తరువాత చిరంజీవి మనసు నాగ్ అశ్విన్ పై పడినా అతడితో ఒక భారీ సినిమాను చేయడం కంటే కొరటాల శివతో ఒక భారీ సినిమాను చేయడం మంచిది అని చిరంజీవి సన్నిహితులు కొందరు సూచనలు ఇస్తున్నట్లు టాక్. దీనితో చిరంజీవి నాగ్ అశ్విన్ ల ఆలోచనలలో వస్తున్న మార్పుల నేపధ్యంలో మధ్యలో నాని ప్రస్తావన వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: