ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాలలోకి వచ్చిన పవన్ ఇప్పుడు ఫుల్ టైం రాజకీయ వేత్తగా మారిపోయిన నేపధ్యంలో సినిమాల విషయంలో పవన్ దృక్పధంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. పవన్ తన సినిమా కెరియర్ లో ఎప్పుడూ లేని విధంగా ఈమధ్య చాలా తక్కువ గ్యాప్ లో ‘రంగస్థలం’ ‘నాపేరు సూర్య’ ‘నేలటిక్కెట్టు’ మూవీల ఫంక్షన్స్ కు రకరకాల కారణాలతో అతిథిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.   
BELLAM KONDA SRINIVAS SAAKSHAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గతంలో చిరంజీవి ‘ఖైది నెంబర్ 150’ ఫంక్షన్ కు కూడ వెళ్ళని పవన్ ఇలా రకరకాల కారణాలతో సినిమా ఫంక్షన్స్ కు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇలాంటి పరిస్థితులలో పవన్ మరో యంగ్ హీరో సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కు అతిధిగా రాబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే తో హీరొయిన్ గా దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో నిర్మింప బడ్డ ‘సాక్ష్యం’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు పవన్ అతిధిగా రాబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. దీనికి కారణం కేవలం నెలరోజుల గ్యాప్ లో పవన్ అతిధిగా హాజరు అయ్యే నాల్గవ సినిమా ఫంక్షన్ గా ‘సాక్ష్యం’ మూవీ ఫంక్షన్ మారబోతోంది.

సంబంధిత చిత్రం

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఫంక్షన్ ఈనెల 26న జరగనుంది అని వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ ఒకవైపు రాజకీయాలు చూస్తూనే మరొక వైపు ఫిలిం ఇండస్ట్రీతో తన సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఇలాంటి వ్యూహాలు పవన్ అనుసరిస్తున్నాడా ? లేదంటే పవన్ ఇలా వరసపెట్టి సినిమా ఫంక్షన్స్ కు రావడం వెనుక మరేదైనా వ్యూహం ఉందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. సినిమాలు చేస్తున్నా ఇంకా సరైన హిట్ రాణి బెల్లంకొడ శ్రీనివాస్ కు పవన్ గోల్డెన్ టచ్ ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: