హైదరాబాద్ పరిధిలోని బల్కంపేట ఆర్యసమాజ్ లో జరిగిన ఓ వివాహం కలకలం రేపుతోంది.    వరుడి సోదరి, బుల్లితెర నటి అంజలి తమ బిడ్డకు మాయ మాటలు చెప్పి బెదిరించి కిడ్నాప్ చేశారని వధువు  తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. ఎస్సార్ నగర్ ప్రాంతానికి చెందిన టి వెంకటేశ్ (28), జి దివ్య (24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దివ్య తల్లిదండ్రులకు ఈ వివాహం ఎంతమాత్రమూ ఇష్టంలేదు. కుమార్తె ప్రేమ వివాహం తెలుసుకున్న తరువాత వారిని మందలించారు.

రోజుల క్రితం దివ్య ఇంటి నుంచి వెళ్లిపోగా, తన కుమార్తెను వెంకటేష్ సోదరి, నటి అంజలి కిడ్నాప్ చేసిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను తన సోదరుడు వెంకటేశ్ కు ఇచ్చి వివాహం చేయాలన్నది ఆమె ఆలోచనని ఆరోపించారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని వారు కోరారు.  అయితే వెంకటేశ్, దివ్య ఆర్యసమాజ్ లో వివాహం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే..దివ్య అనే యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో ఇది కొత్త ట్విస్ట్.
Image result for love marriage
పోలీసుల ముందు దివ్యతో సహా హాజరైన అంజలి, వెంకటేశ్ లు తాము మేజర్లమని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని వెల్లడించారు.  వారి వెంట బుల్లి తెర నటి అంజలి కూడా వచ్చారు.  అయితే వధూవరుడు మేజర్లు కనుక ఈ పెళ్లి చట్టరిత్యా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. అంతే కాదు పోలీస్ స్టేషన్ కు అంజలితో కలసి వచ్చిన ఈ జంట, తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని రాతపూర్వకంగా రాసిచ్చారు.

ఆపై పోలీసు అధికారులు మాట్లాడుతూ, నూతన వధూవరులిద్దరూ మేజర్లేనని, యుక్త వయసు వచ్చిన వారు తమ ఇష్టానుసారం ఎవరినైనా వివాహం చేసుకునే హక్కును కలిగివుంటారని, దివ్య తల్లిదండ్రులకు ఈ విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: