తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా తారలపై ఎవరూ బయోపిక్ తీయలేదు...మొదటి సారిగా అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్వన్ ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించారు.  మొదట ఈ చిత్రంపై ఎన్నో సందేహాలు వచ్చినా..థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అందరూ ఫిదా అయ్యారు.  ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనబరిచిన నటన అద్భుతం అంటూ అన్ని వర్గాల నుంచి ప్రశంసలు గుప్పిస్తున్నారు.  ఈ చిత్రం ప్రతి ఒక్క పాత్ర ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దిన నాగ్ అశ్విన్ ని సినీ పెద్దలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. 
Image result for mahanati
మరోవైపు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ కూడా తెరపైకి రాబోతుంది. అయితే ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి ముహూర్తం కూడా రెడీ చేశారు.  కాకపోతే ఈ చిత్ర దర్శకులు తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా..సరైన దర్శకుల గురించి బాలకృష్ణ వెయిట్ చేస్తున్నారు.  ఇక మహానటి చిత్రం అద్భుత విజయం సాధించడంతో..సినీ ప్రముఖుల జీవితాలపై మేకర్స్ కన్నుపడింది. ఇందులో భాగంగా సౌందర్య లేదా జయలలిత బయోపిక్ ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.
Related image
వీటితో పాటు ఉదయ్ కిరణ్ బయోపిక్ కూడా తెరపైకొచ్చింది. తేజ ఈ బయోపిక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఉదయ్ కిరణ్ ను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి తేజ. చిత్రం అనే సినిమాతో హీరోగా మారిన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత తేజ తీసిన నువ్వు-నేను సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు కెరీర్ లో వరుస ఫ్లాపులు చవిచూశాడు. అదే డిప్రెషన్ లో సూసైడ్ చేసుకున్నాడనే ప్రచారం కూడా ఉంది.
Image result for raj kandukuri
ఈ వివరాలతో ఓ బయోపిక్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. రాజ్ కందుకూరి కూడా సౌందర్య బయోపిక్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ నిర్మాత, హైదరాబాద్ వచ్చిన వెంటనే సౌందర్య బయోపిక్ పై ఓ ప్రకటన చేస్తానంటున్నాడు. మొన్నటివరకు జయలలిత బయోపిక్ గురించి ఆలోచించిన ఈ ప్రొడ్యూసర్.. ఇప్పుడు సౌందర్య జీవితంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: