ఈ రోజుల్లో సినిమాలు ఎక్కువలో ఎక్కువ మూడు లేక పోతే నాలుగు వారాలు నడిచి థియేటర్స్ కు గుడ్-బై చెప్పేస్తున్నాయి. కాని ఈ మద్య మన యువనటులు నటనను సంపాదన మార్గం గానే కాకుండా ఒక అభిలాషగా మార్చుకుని అభిరుచిగా (పాజన్) గుర్తిస్తూ నటనను తారాస్థాయికి చేరుస్తున్నారు.
అలాంటి ఒక ఉదాహరణే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం "రంగస్థలం" అభిరుచిగల యువ దర్శకరత్నం సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత మార్చి నెల 30 తేదీన విడుదలై నిన్నటికి (19.05.2018) అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుంది-యాభై రోజులు పూర్తి చేసుకుంది. "బ్లాక్ బస్టర్ హిట్" సాధించిన చిత్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ వసూళ్ళ పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్ ఈ సినిమాతో మరో స్థాయి కి చేరిపోయారు.
అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్లో సందడి చేస్తూ 50రోజులను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత 'భరత్ అనే నేను' .. 'నా పేరు సూర్య' వంటి పెద్ద హీరో ల సినిమాలు వచ్చినా, అవి "రంగస్థలం" వెలవెల పోతూ దీనిపై దీని వసూళ్లపై చూపించిన ప్రభావం దాదాపు శూన్ యం అనే చెప్పాలి. వసూళ్ల పరంగా, నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది అత్యున్నత చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ₹200 కోట్లకి పైగా గ్రాస్ను, ₹120 కోట్లకి పైగా షేర్ను రాబట్టింది.
కథ.. కథనాలు.. సంగీత.. సాహిత్యాలు.. చిత్రీకరణ..నటన.. సంభాషణలు.. శబ్ధం.. సినిమా వాతావరణం.. పీరియడ్.. ఈ సినిమాకి ఆయువుపట్లు ఆభరణాలుగా నిలిచి, ఈ సినిమాను ఒక ప్రక్క క్లాసిక్ గా మరో ప్రక్క మాస్ సినిమాగా ఒక స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి. ఈ చిత్రాన్ని చూసిన అనేక ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.