ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని వారి కుమార్తె శైలజ తెలిపారు. తెలుగులో పలు ప్రఖ్యాతిగాంచిన నవలలు ఆమె రాశారు. ఆమె రాసిన నవలల ఆధారంగా అనేక సినిమాలు తీశారు. మధ్యతరగతి జీవితాల గురించి ఆమె అనేక విషయాలను తన నవలల్లో ప్రస్తావించేవారు. 1970 దశకంలో యుద్దనపూడి సులోచనరాణి రాసిన నవలలు అనేకం ఎంతో ప్రసిద్ది చెందాయి.


సెక్రటరీ యద్దనపూడి సులోచనారాణి రచించిన బహుళ ప్రాచుర్యం పొందిన నవల 1964లో తొలిసారి ప్రచురణ పొందిననాటి నుంచి ఎన్నో ముద్రణలు పొంది పాఠకుల ఆదరణను, సినిమాగా చిత్రితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో యుద్దనపూడి సులోచనరాణి జన్మించారు. తను పరిశీంచిన జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని ఆమె రచనలు చేశారు. . తర్వాత కాల్పనిక జగత్తుకు అనుగుణంగా, మారుతున్న ప్రజల జీవిన విధానాల్లో వచ్చిన మార్పులను బట్టి పాత్రలను సృష్టించారు. 

Famous novels yaddanapudi sulochana rani passed away

భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.   


 1965లో మనుషులు - మమతలు సినిమాకు కథను అందించారు. తర్వాత వీరు రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్ గా మిగిలిపోయింది.  మీనా (నవల), జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, బంగారు కలలు, విచిత్రబంధం, జై జవాన్, ఆత్మ గౌరవం


టీ.వీ. ధారావాహికలు, సీరియళ్ళు :
రాధ మధు


నవలలు :
ఆగమనం
ఆరాధన
ఆత్మీయులు
అభిజాత
అభిశాపం
అగ్నిపూలు
ఆహుతి
అమర హృదయం
అమృతధార
అనురాగ గంగ
అనురాగ తోరణం
అర్థస్థిత
ఆశల శిఖరాలు
అవ్యక్తం
ఋతువులు నవ్వాయి
కలలకౌగిలి
కీర్తికిరీటాలు
కృష్ణలోహిత
గిరిజా కళ్యాణం
చీకటిలో చిరుదీపం
జీవన సౌరభం
జాహ్నవి
దాంపత్యవనం
నిశాంత
ప్రేమ
ప్రేమదీపిక
ప్రేమపీఠం
బహుమతి
బందీ
బంగారు కలలు
మనోభిరామం
మౌనతరంగాలు
మౌన పోరాటం
మౌనభాష్యం
మోహిత
వెన్నెల్లో మల్లిక
విజేత
శ్వేత గులాబి
సెక్రటరీ
సౌగంధి
సుకుమారి


మరింత సమాచారం తెలుసుకోండి: