తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి హీరో నందమూరి కళ్యాన్ రామ్. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలు తెరకెక్కించాడు ఈ నందమూరి కుర్రోడు. అయితే ఇప్పటి వరకు యాక్షన్, కుటుంబ చిత్రాలు మాత్రమే తీసిన కళ్యాన్ రామ్ మొదటి సారిగా ఓ లవర్ బాయ్ గా నటిస్తున్నాడు. దమూరి కళ్యాణ్రామ్, తమన్నా జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘నా నువ్వే’. మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుతూ వస్తున్నా ఈ చిత్రం మే 25న(రేపు) విడుదల కావాల్సిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఉన్న విపరీతమైన పోటీ వల్ల చివరి క్షణంతో రేస్ నుండి తప్పుకుంటూ వారం రోజుల పాటు ‘నా నువ్వే’ చిత్రాన్ని వాయిదా వేశారు.
లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ప్రధానంగాగా ఉండే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువల్స్.. తమిళ దర్శకుడు జయేంద్ర పనితనం.. శరత్ అందించిన మెలోడియస్ ఆల్బమ్ సినిమాకు మేజర్ ఎసెట్గా నిలుస్తున్నాయి. అయితే జూన్1 న కూడా రిలీజ్ అవుతుందా కాదా అన్న అనుమానాలు వస్తున్నాయి.
ఎందుకంటే.. ఆ రోజున విశాల్ అభిమన్యుడు, కింగ్ నాగార్జున నటించిన ఆఫీసర్, రాజతరుణ్ నటించిన రాజుగాడు, జయప్రద ప్రధాన పాత్రలో నటించిన శరభ రీలీజ్ కానున్నాయి.. దీంతో ఒకే రోజు అయిదు మూవీలు విడుదలైతే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని నా నువ్వే నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ తదుపరి వారం రిలీజ్ చేయాలంటే..రజినీకాంత్ నటిస్తున్న ‘కాలా ’ తెలుగులో రిలీజ్ కాబోతుంది. దాంతో ‘నా నువ్వే’ కొత్త రిలీజ్ తేదిపై నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు.