‘మెహబూబా’ మూవీ ఘోర పరాజయంతో పూరీ జగన్నాథ్ కు సుమారు 15 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నష్టాల నుండి పూరి తెరుకోవాలి అంటే వెంటనే ఎవరో ఒకరి టాప్ హీరో సహకారం కావాలి. అయితే పూరి పేరు చెపితే హీరోలు పారిపోతున్న ప్రస్థుత పరిస్థుతులలో తన తదుపరి మూవీ ప్రాజెక్ట్ కు హీరోగా నటించే విషయంలో నాగార్జునను అంగీకరింప చేసేందుకు పూరి ఛార్మీ ద్వారా నాగ్ తో జరిపిన రాయబారం ఫెయిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
CHARMEE ALONG WITH PURI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో పూరి తన రూట్ మార్చి నందమూరి సింహం బాలకృష్ణ పై తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పూరి బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీ పరాజయం చెందినా బాలయ్యకు పూరి పట్ల అభిమానం ఉండటంతో ఇప్పుడు ఆ అభిమానాన్ని తనకు సహాయంగా మార్చుకోవాలని పూరి శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 
BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
పొగడ్తలకు ఇట్టే పడిపోయే బాలయ్య వ్యక్తిత్వం పూరీకి బాగా తెలిసిన నేపధ్యంలో తన కష్టాల నుండి గట్టెక్కించమని పూరి బాలయ్య పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. బాలయ్యకు పూరి కష్టాలు తెలిసినప్పటికీ అతడికి అభయం ఇచ్చే విషయంలో బాలకృష్ణ ఎటూ తేల్చుకోలేని పరిస్థుతులలో ఉన్నాడని అంటున్నారు. దీనికి కారణం బాలయ్య ప్రస్తుత దృష్టి అంతా ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉంది. రేపు నందమూరి తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా ఈ బయోపిక్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన బాలకృష్ణ నుండి వస్తుందని ఆశిస్తున్నారు. 
KRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ దర్శక బాధ్యతలను చేపట్టడానికి క్రిష్ అంగీకరించినట్లుగా వార్తలు రావడమే కాకుండా ఈమూవీలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటించడానికి అనేక ఆలోచనలు తరువాత నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లు టాక్. ఈవార్తలు అన్నీ నిజాలు అయితే పూరి బాలయ్య పై పెట్టుకున్న ఆశలు అన్నీ నిరాశ పరిచే విధంగా మారబోతున్నాయి అనుకోవాలి. అటువంటి పరిస్థితే ఎదురైతే పూరి తన కొడుకు ఆకాష్ ను మళ్ళీ హీరోగా చేసి అమెరికాలో మార్షల్ ఆర్డ్స్ నేపధ్యంలో ఒక యాక్షన్ సినిమాను ఛార్మీ సహకారంతో తీయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: