ఈ మద్య సినీ ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు బాగానే వస్తున్నాయి.  సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా సెలబ్రెటీల జీవితాలు అధారంగా చేసుకొని బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.  రీసెంట్ గా అలనాటి అందాల తార మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ బయోపిక్ తెరకెక్కించారు.  ఆ సినిమా అంచనాలు మించి మంచి సక్సెస్ తో సాగుతుంది.  ఇక మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని మరో చిత్రాన్ని తీయబోతున్నారు.  ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నారు.

అంతే కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ కూడా తెరకెక్కుతుంది.  తాజాగా బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం వెండితెరపైకి రానుంది. సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.  ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విజయ్ మాల్యా భారత్‌లోని డజనుకు పైగా బ్యాంకుల్లో రూ.9 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయాడు.
Vijay Mallyas Biopic All Set To Release, Govinda Plays The Lead Role - Sakshi
ప్రస్తుతం ఈయన లండన్‌లో ఉంటున్నాడు. ఇక ఈ చిత్రంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై ఓ పాటను కూడా కంపోజ్ చేశామని, ఈ పాటకు చిన్ని ప్రకాశ్ కొరియోగ్రఫీ అందించాడని ఆయన వెల్లడించారు.

ఇక ఈ చిత్రంలో గోవింద కొత్త అవతారంలో కనిపించనున్నాడని, ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని పహ్లజ్ అన్నారు. అయితే గతంతో పహ్లజ్ నిహ్లానీ, గోవిందతో ‘రంగీలా రాజా’ను తెరకెక్కించారు.  35 ఏళ్ల తర్వాత నిహ్లాని దర్శకత్వంలో గోవింద నటిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ పాటను చిత్రీకరించారని తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: