‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు బాసటగా మెగా కుటుంబ సభ్యులు తప్పించి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కు ఓపెన్ గా మద్దతు ఇస్తూ ప్రకటనలు ఇస్తున్న వారి సంఖ్య చాల తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘అర్జున్ రెడ్డి’ మూవీ దర్శకుడు సందీప్ వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనితో సందీప్ చేసిన ట్విట్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
నిజమైన తెలుగు సైనికుడుగా పవన్ ను సందీప్ రెడ్డి అభివర్ణిస్తూ పవన్ కు ఎలాంటి రాజకీయ వారసత్వం లేదని ఆయనకు పాలించే అవకాశం ఇస్తే తెలుగోడి గురించి తెల్లోడు మాట్లాడుకునేలా చేస్తాడని అంటూ సందీప్ చేసిన ట్విట్ ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ‘‘ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారికి ఒక నాయకుడు నిజమైన మన తెలుగు సైనికుడికి నీకోసం ప్రాణం సైతం లెక్క చేయని జవాన్లా నిలబడే వాడికి, ఒక సామాన్యుడికి, రాజకీయ వారసత్వం లేని వాడికి మన తెలుగు రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇవ్వండి. ఈ తెలుగోడి గురించి తెల్లోడు మాట్లాడుకునేలా చేస్తాడు పవన్ కల్యాణ్’’ అని సందీప్ ట్వీట్లో పేర్కొన్నాడు.
అయితే సందీప్ రెడ్డి ట్విట్ లో పేర్కొన్న తెల్లోడు ఎవరు అన్న విషయం పై కొందరు సందేహాలు వ్యక్తపరుస్తూ తెల్లవారు అంటే ఉత్తర భారత ప్రజలా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న పోరాట యాత్రకు యూత్ బాగా వస్తున్న నేపధ్యంలో వస్తున్న ఈ స్పందన చూసి రాజకీయ వర్గాలలో గుబులు మొదలైంది.
పవన్ ఉపన్యాసాలకు ఊగిపోతూ అరుపులు అరుస్తున్న ఈ యూత్ అంతా ‘జనసేన’ కు ఓట్లు వేస్తే అది చంద్రబాబుకు నష్టమా లేక జగన్ కు నష్టమా అన్న విషయమై తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో తెలుగుదేశం ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెడుతున్న నిరుద్యోగ భృతి ఎంతవరకు తెలుగుదేశాన్ని నిలబెట్టగలుగుతుంది అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఏమైనా సందీప్ రెడ్డి స్పూర్తితో ఇంకా ఎంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పవన్ కు బాసటగా బహిరంగంగా రాబోతున్నారు అన్నది రానున్న రోజులలో తేలుతుంది..