‘కబాలి’ తరువాత రంజిత్ రజనీకాంత్ కాంబినేషన్‌ లో వస్తున్న చిత్రం ‘కాలా’ విడుదలకు ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయిన ఈమూవీకి హైక్ తీసుకురావడానికి నిన్న ఈ చిత్రం యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈమూవీ యూనిట్ సభ్యులు అంతా పాల్గొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేకమంది ప్రముఖులు కూడ పాల్గొన్న ఈ ఫంక్షన్ లో అనుకోకుండా దర్శకుడు మారుతి చేసిన కామెంట్స్ రజినీకాంత్ కు అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 
 దేవుడి దీవెనల వల్లే
సాధారణంగా టాప్ హీరోల సినిమా ఫంక్షన్స్ లో పాల్గొనే అతిధులు అంతా ఆ హీరోల భజన చేయడం పరిపాటి. అయితే మారుతి ఈ ఫంక్షన్ లో మాట్లాడిన తీరు చాలమందిని ఆశ్చర్య పరిచింది. గతంలో రజినీకాంత్ రంజిత్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘కబాలి’ చెప్పుకోతగ్గ హిట్ కాదు. ఆసినిమాను కొనుక్కున్న బయ్యర్లకు చాల నష్టాలు వచ్చాయి అన్న వార్తలు కూడ వచ్చాయి. 
ఎవరికి వాళ్లు గొప్పవాళ్లు
అయితే రజినీకాంత్ ఆ పరాజయాన్ని లెక్క చేయకుండా తిరిగి రంజిత్ కు అవకాసం ఇచ్చి రజినీఅల్లుడు ధనుష్ చేత ఈమూవీని నిర్మింప చేసాడు. ఈవిషయాల గురించి ప్రస్తావిస్తూ దర్శకుడు మారుతి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడు తీసిన సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఇక్కడి హీరోలు ఆ దర్శకుడు ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయరని అలాంటిది కబాలి బాగా ఆడకపోయినా దర్శకుడు రంజిత్ కు రజినీకాంత్ పిలిచి మళ్ళీ అవకాశం ఇవ్వడం ఆయన గొప్పతనానికి సంకేతం అని అంటూ మారుతి రజినీ పై ప్రశంసలు కురిపించాడు. 
ధారవి మురికివాడ నేపథ్యంగా
అయితే మారుతి నోటివెంట ‘కబాలి’ ఫ్లాప్ మాటలు విన్నరజనీకాంత్ కాస్త మొహం ఇబ్బందిగా పెట్టుకుని అసహనానికి లోను కావడం ఆకార్య క్రమానికి వచ్చిన అతిథిలకు స్పష్టంగా కనిపించిది. దీనితో మారుతి రజినీకాంత్ ను పొగుడ్తూ అన్న మాటలు మిస్ ఫైర్ అయ్యాయి అంటూ ఈకార్యక్రమానికి వచ్చిన చాలామంది గుసగుసలాడుకున్నట్లు తెలుస్తోంది..
.



మరింత సమాచారం తెలుసుకోండి: