తొలి ప్రేమ మూవీ హిట్ తర్వాత వరుణ్ తేజ్ ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తో ఒక మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నది.. ఈ సినిమాలో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితీ రావు కథానాయికలుగా నటిస్తున్నారు. అంతరిక్షం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, వ్యోమగామి పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు.
క్రిష్ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి అంతరిక్షం అనే టైటిల్ ను ఖరారుచేసినట్లు తాజా సమాచారం. అదితీ రావు ఈ సినిమా షూటింగ్ కోసం స్పేస్ సూట్ వేసుకుని సెట్ లోకి అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తో కలిసి ఆస్ట్రోనాట్ గెటప్ లో ఓ సెల్ఫీ తీసుకుని దీనిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ‘‘చందమామను వెంటాడదం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం’’ అంటూ ఫన్నీగా కామెంట్ యాడ్ చేసింది.
‘అంతరిక్షం’ (ప్రచార టైటిల్)లో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. వి.ఎఫ్.ఎక్స్కు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తుంది. వాళ్లతో కలిసి వరుణ్ దిగిన ఫోటోలు షేర్ చేశారు వరుణ్. ఈ చిత్రంలో వరుణ్కి జోడీగా లావణ్య త్రిపాఠి, ఆదితీరావు హైదరీ నటిస్తున్నారు.
ఫస్ట్ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటిసారిగా భారతదేశంలో 'ఘాజీ' సినిమా ద్వారా ఈ ప్రయత్నాన్ని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు ఇదే స్పూర్తితో మరో ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.