తెలుగు ఇండస్ట్రీలో రవికిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రకూల్ ప్రీత్ సింగ్ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి టాప్ పొజీషన్లోకి వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్ సెక్సెస్ ఫెల్యూర్స్ తో సంబంధం లేకుండా యంగ్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారిపోయింది.
ఒకదశలో తెలుగు హీరోలు తమ పక్కన రకూల్ అయితే బాగా సెట్ అవుతుందన్న అభిప్రాయానికి కూడా వచ్చారు. స్వతహాగా మోడలింగ్ నుంచి వచ్చిన రకూల్ గ్లామర్ రోల్స్ బాగానే వేస్తుంది. ఇక బికినీ విషయానికి వస్తే..ఈ అమ్మడు దేనికైనా సై అంటుంది. పవర్స్టార్ పవన్కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వంటి హీరోలతో మినహా తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా ఆడిపాడింది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్.
కాకపోతే ఈ మద్య యంగ్ హీరోయిన్లు బాగానే వస్తున్నారు..ఈ నేపథ్యంలో తెలుగు లో ఈ అమ్మడికి కాస్త చాస్సులు తగ్గుతున్నాయని ఫిలిమ్ వర్గాల టాక్. దాంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇటీవలె `అయ్యారీ` అనే బాలీవుడ్ సినిమాలో రకుల్ నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అజయ్ దేవగణ్ సినిమాలో కూడా రకుల్ నటిస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే పెంచిందని అంటున్నారు.