అనేక భారీ పరాజయాలతో ఆర్ధికంగా నష్టపోయిన నిర్మాత అశ్వినీదత్ కు ‘మహానటి’ మూవీ అదృష్టంగా మారి కోట్లు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ‘మహానటి’ మూవీ సక్సస్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్ అశ్వినీదత్ ల మధ్య చిచ్చు పెట్టింది అనివార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ మహేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి నిర్మాతలుగా కొనసాగుతున్నారు. 
Mahesh Babu 25th New Movie Opening
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. అయితే ‘మహానటి’ ఇచ్చిన సక్సస్ తో జోష్ మీద ఉన్న అశ్వినీదత్ మహేష్ సినిమాకు సంబంధించిన పెట్టుబడి అంతా తానే పెడతానని అందువల్ల దిల్ రాజ్ కు ముందు అనుకున్నట్లు కాకుండా తక్కువ షేర్ ఈమూవీ లాభాలలో ఇస్తానని రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఈఅనుకోని పరిణామానికి షాక్ అయిన దిల్ రాజ్ మహేష్ లేటెస్ట్ మూవీ విషయంలో తన షేర్ తగ్గించుకోనని అందువల్ల అశ్వినీదత్ కు ఎక్కువ వాటా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
Mahesh Babu
ఇప్పుడు ఈవిషయాలు మహేష్ వరకు చేరడంతో ఈమధ్యనే మహేష్ వీరిద్దరినీ పిలిపించి సద్దుబాటు చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ మాటలకు కూడ పూర్తిగా అటు అశ్వినీదత్ ఇటు దిల్ రాజ్ పూర్తిగా అంగీకరించకపోవడంతో తన సినిమా మొదలు కాకుండానే ఈ సమస్యలు ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు టాక్. 
Mahesh Babu's Bharat Ane Nenu stresses about 'Education System'
మహేష్ 25వ సినిమాగా అత్యంత భారీ అంచనాలతో రూపొందబోతున్న ఈమూవీకి ఇలాంటి సమయంలో నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు రావడం మంచిది కాదని మహేష్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి తో ఏర్పడ్డ వివాదాన్ని మహేష్ చాల చాకచక్యంగా పరిష్కరించాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో లేటెస్ట్ గా దిల్ రాజ్ అశ్వినీదత్ ల మధ్య ఏర్పడ్డ ఈ గ్యాప్ మహేష్ ను కలవర పెడుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారంమేరకు దిల్ రాజ్ ఈవార్తలను ఖండించడమే కాకుండా ఇలాంటి విషయాలు బిజినెస్ లో సర్వసాధారణం అంటూ తేలికగా తీసివేసినట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: