తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యంగ్ హీరోల హవా బాగానే కొనసాగుతుంది. ముఖ్యంగా నాని, శర్వానంద్, నాగశౌర్య, దేవరకొండ విజయ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలు తమ సత్తా చాటుతున్నారు. ఛలో, కణం లాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్న హీరో నాగశౌర్య మంచి దూకుడు మీదే ఉన్నాడు. తాజాగా నాగశౌర్య కథానాయకుడిగా 'నర్తనశాల' సినిమా రూపొందుతోంది. అలనాటి క్లాసిక్ మూవీకి .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదనీ .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా కొనసాగుతుందని నాగశౌర్య మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశాడు.
ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైన విషయం తెలిసిందే. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, పోసాని కృష్ణ మురళి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీ లోగో విడుదల చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్లో పాత నర్తనశాల మూవీ పోస్టర్తో లోగో పోస్టర్ అదిరింది.
ఇప్పటికే ఇక్కడ కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఇటీవలే ఇటలీ వెళ్లింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. మిగతా పనులను చకచకా పూర్తి చేసేసి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా, 'ఛలో' మాదిరిగా ఆయనకి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.