టాలీవుడ్ లో ఈ మద్య మల్టీస్టారర్ మూవీలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, మరియు శోభన్ బాబులు ఎలాంటి ఈగోలు లేకుండా, పాత్రలపై పట్టింపు లేకుండా వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలలో నటించి, మెప్పించారు. వాళ్ళ తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు అడపాదడపా గెస్ట్ రోల్ లో నటించారు గాని పూర్తి స్థాయి మల్టీస్టారర్‌ లో నటించలేదు. 

చాలా కాలం తర్వాత  వెంకటేష్-మహేష్ బాబు  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో వచ్చి, టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్‌ సినిమాలకు ఊపు తెచ్చారు.  ఆ తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాన్ నటించిన గోపాల గోపాల కూడా ఘన విజయం సాధించింది.  ఆ తర్వాత రామ్ ,వెంకి కాంబినేషన్ లో వచ్చిన మసాల కూడా మంచి హిట్ అయ్యింది. తాజాగా హ్యాట్రిక్‌ సినిమాల దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌-2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

విక్టరీ వెంకటేష్‌-మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌లు ఎఫ్‌-2లో హీరోలుగా నటించనున్నారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్‌ని, వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు.. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఈ మూవీకి పూజా కార్యక్రమాలను రేపు నిర్వహించనున్నారు.. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: