ప్రెస్టీజియస్ సూపర్ స్టార్ & బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ప్రియుడు, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. అయితే ఈమద్యే ఆమెతో కలిసి ముంబాఇలో ల్యాండ్ అయ్యింది. బే-వాచ్ మరియు క్వాంటికో నిర్మాణాలా పేరుతో ఇంతకాలం వివిధ విదేశాల్లో తిరిగిన ఈ జంట ఇప్పుడు ఏకంగా భారత్ లో దర్శనం ఇవ్వటంతో ఆమె అభిమానులే కాదు ఇతరులూ అంతా ఆశ్చర్యపోయారు. 
priyanka chopra కోసం చిత్ర ఫలితం
ప్రియాంక చోప్రా ముంబైలో కొత్తగా ఒక అద్భుత నివాస భవనాన్ని కొనుగోలు చేసిందట. గృహప్రవేశం కోసమే తన ప్రియుడి తో కలిసి వచ్చిందని సినీ వర్గాల సమాచారం. అయితే ప్రియాంక కొన్నది సాధారణ ఆషామాషీ భవనం కాదు ₹100 కోట్లు విలువైనదని బాలీవుడ్ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతోంది.  ముంబై నడిబొడ్డున ఆరేబియా సముద్రానికి ఎదురుగా  "సీ-వ్యూ" భవనమని సమాచారం. ప్రియాంక తన ప్రియుడు నిక్ జొనాస్ పట్ల తన ప్రేమను అద్భుతంగా ప్రకటించటానికే బహుమతి ఇవ్వడం కోసమే ఈ సూపర్ భవనాన్ని కొన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  
Image result for priyanka chopra
ఈ భవనం లో గృహప్రవేశం తర్వాత కొన్ని రోజుల పాటు "నిక్ - ప్రియాంక" ఈ ఇంట్లోనే "సహజీవనం" చేస్తారనే వార్తలు ముంబాయి వాసుల్లో ప్రచారంలో ఉంది. అందుకే తన వెంట ప్రియుడు నిక్ జొనాస్ ను తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతే కాదు తన ప్రేమకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేసిన తన తల్లి మధు చోప్రాకి ప్రియుణ్ణి పరిచయం చేసి తల్లి అనుగ్రహం, ఆశీస్సులు పొందే ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చని బాలీవుడ్ సమాచారం.
సంబంధిత చిత్రం
ప్రియాంక గత కొన్నాళ్లుగా అమెరికాలోనే ఎక్కువగా ఉంటోంది. హాలీవుడ్ సినిమాలు - అమెరికన్ టీవీ సిరీస్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఆ డబ్బుతోనే ముంబైలో 100 కోట్లతో బంగళా కొన్నట్టు పుకార్లు నిడుగా ఉన్నాయి. ఇంకేం నిక్ జొనాస్ చాలా అదృష్ఠవంతుడని అంటున్నారు సినీ జనులు. మని + షి రెండూ ఇక నిక్ జొనాస్ సొంతం. 

Image result for priyanka chopra

మరింత సమాచారం తెలుసుకోండి: