బిగ్ బాస్ సీజ‌న్ 2లో ఏదైన జ‌ర‌గొచ్చు అని నాని చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు హౌజ్‌లో అస‌లు సిస‌లైన నాట‌కం న‌డుస్తుంది.  బిగ్ బాస్ మొదలై రెండు వారాలు అవుతుంది..ఇప్పటి వరకు సంజన చేసిన హంగామా తప్ప ఏదీ పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించలేదు.  కానీ నిన్న జరిగిన రచ్చ మాత్రం బిబ్ బాస్ 2 రణస్థలంగా మారిందా అన్న అనుమానాలు తలెత్తాయి.  మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ఫైర్ కావ‌డం , టాస్క్ కంప్లీట్ చేయ‌లేక బిగ్ బాస్‌ని క్ష‌మించ‌మ‌ని కోరడం లాంటి ప‌లు నాట‌కీయ స‌న్నివేశాలు ఎపిసోడ్ 13లో జ‌రిగాయి.

నిన్న‌టి (జూన్ 22) ఎపిసోడ్‌లో ఇంటి రూల్స్ అతిక్ర‌మించిన కార‌ణంగా హౌజ్ మేట్స్‌కి కొవ్వొత్తుల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. కాని అది పూర్తి చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డిన హౌజ్‌మేట్స్ బిగ్ బాస్‌ని క్ష‌మించమ‌ని వేడుకున్నారు. దీంతో కొవ్వొత్తుల శిక్ష ముగిసిన‌ట్టు ప్ర‌క‌టించారు బిగ్ బాస్‌. భోజనం స‌మ‌యంలో తిండిని చాలా వృధా చేస్తుండ‌డంతో పాటు తిన్న కంచాలు కూడా స‌రిగా క‌డ‌గ‌డం లేదు. ఈ క్ర‌మంలో కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్‌.. తిన్న ప్లేట్స్‌ని కూడా క‌డగ‌డం స‌రిగా రాదా.. మీ ఇంట్లో వారు అవేమి నేర్పించ‌లేదా అంటూ నూతన్ నాయుడుకి క్లాస్ పీకారు.

ఆ సమయంలో ఇంట్లో ఇలాంటి అలవాట్లు నేర్పించలేద అన్నారు. బోజనం చేసిన వచ్చిన నూతన్ నాయుడు ఉన్నట్టుండి సామ్రాట్ పై విరుచుకు పడ్డాడు.  ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడేస‌రికి కోపోద్రిక్తుడైన నూత‌న్ నాయుడు ఏదైనా ఉంటే హౌస్‌లో తేల్చుకోవాలి. అంతేకాని కుటుంబాల గురించి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదంటూ ఆవేశంతో సామ్రాట్ పైకి దూసుకు వచ్చారు నూతన్ నాయుడు. అయితే మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకున్న త‌నీష్‌, సామ్రాట్‌ని వెనుకేసుకొస్తూ నూత‌న్ నాయుడుపైకి దూసుకొచ్చాడు.ఇక్కడ ఎవరూ గాజులు తొడిగించుకోలేదంటూ’ వ్యక్తిత్వంలో నా ఎడమకాలి గోటికి కూడా సరిపోవు అంటూ ఫైర్ అయ్యారు నూతన్ నాయుడు.

నేను మీ ఫ్యామిలీ గురించి మాట్లాడ‌లేద‌ని నూత‌న్ నాయుడుకి సామ్రాట్‌ చెప్ప‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది.హౌజ్‌లో అమ్మాయిల‌ప‌ట్ల నువ్వు ఎలా ప్ర‌వ‌ర్తిసున్నావో అంద‌రికి తెలుసు అని త‌నీష్ అన‌డంతో కౌశ‌ల్, త‌నీష్‌ల మ‌ధ్య యుద్ధం జ‌రిగినంత ప‌ని అయింది. దీప్తి సునైన త‌నకి చెల్లిలాంటిద‌ని , టాస్క్‌లో భాగంగా నే త‌న‌ని ఎత్తుకున్నానే త‌ప్ప మ‌న‌సులో వేరే ఫీలింగ్స్ ఏమి లేవ‌ని చెప్పాడు కౌశ‌ల్‌. హౌజ్ మేట్స్ ఏం చేసిన తాళ్ల‌ని ప‌ట్టుకొని అలానే ఉంటారో వారే విజేత అని బిగ్ బాస్ ప్ర‌క‌టిచండంతో, ముగ్గురి మ‌ధ్య టాస్క్ ఆస‌క్తిక‌రంగా సాగింది.

కిరీటీ కౌశ‌ల్ ద‌గ్గ‌రకి వ‌చ్చి మీరు ఆడ‌వాళ్ల ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరు నాకు న‌చ్చ‌లేదు. అందుకే మీ క‌ళ్ళ‌లో నిమ్మ‌ర‌సం, పేస్ట్ పిండుతున్నానని చెప్ప‌డంతో మిగిలిన స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  ఆ తర్వాత తనిష్, కౌషల్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని అమిత్ కి ఇచ్చారు.  తర్వాత  కౌశ‌ల్‌.. కిరిటీ వద్దకు వచ్చి తాను ఏ ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నానని గట్టిగా నిలదీశాడు. భాను శ్రీ, దీప్తి సునైనా, తేజస్వి నీ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు కిరీటి.  ఆ ముగ్గురుని పిలిపించి అడిగారు..వారు కొత్తలో అలా అయ్యిందే కానీ కౌశల్ తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. 
rangasthalam in bigg boss2
దీంతో చేసేదేం లేక కౌశ‌ల్‌కి సారీ చెప్పాడు కిరీటి దామరాజు. ఇక ఈ పరిస్థితి మొత్తాన్ని స్మోకింగ్ రూం లో నుండి గమనిస్తున్న తనీష్ సైలెంట్‌గా ఉండిపోయారు.   మొత్తానికి వీక్ ఎండ్ సమయంలో బిగ్ బాస్ 2 ఎవరూ ఊహించని ట్విస్ట్ లు..ఫైట్స్ తో ముగిసింది. చివరగా బిగ్ బాస్ మాట్లాడుతూ..బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: