గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడి పోరాటం పీక్ స్టేజ్ లో ఉండగానే పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి ఇంటి వద్ద ఉంటూనే సోషల్ మాద్యమాల్లో పోస్టులు పెడుతుంది. ఇదిలా ఉంటే ఈ మద్య టాలీవుడ్ లో మరికొన్ని సంచలనాలు చోటు చేసుకున్నాయి. టాలీవుడ్ కి చెందిన కొంత మంది హీరోయిన్లు, యాంకర్లు అమెరికాలో సెక్స్ రాకెట్ లో భాగస్వామ్యం అయ్యారని వార్తలు వస్తున్నాయి.
సెక్స్ రాకెట్ కొన సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది.
అమెరికాలో కిషన్ - చంద్ర దంపతులపై నమోదైన కేసు గురించి ప్రస్తావిస్తూ ఈరోజు పూనమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అంతే కాదు గతంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న ఇబ్బందిని కూడా ప్రస్తావించింది. అమెరికాలోని ఓ ఈవెంట్ కోసం తాను వెళ్లిన సమయంలో ఒంటరిగా హోటల్ లో ఉన్న నా వద్దకు వాడు వచ్చాడని.. అమాయకమైన అమ్మాయి అనుకొని రెచ్చిపోతే బుద్ది చెప్పానని తెలిపింది.
అతడు మాట్లాడింది నాకు అర్థం కాదు అనుకున్నాడని.. కానీ తనకు తెలుగు అర్థం అవుతుందని పూనమ్ తెలిపింది. ఆ సమయంలోనే అతి చేస్తే చెంప పగులకొట్టానని పేర్కొంది. డబ్బు తో లొంగ దీసుకోవాలని అక్కడ చాలా మంది ప్రయత్నిస్తుంటారని ఆరోపించింది.