ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇట్టే వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కొంత మంది ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని టార్గెట్ చేసుకొని అభ్యంతరకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే స్వయంగా పవన్ కళ్యాన్ ట్విట్టర్ లో రేణు దేశాయ్ కి ఎంతో గౌరవంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ కల్యాణ్తో విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పానంటే ఆయన అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని జనసేన అధిపతి మాజీ భార్య రేణూ దేశాయ్ హెచ్చరించారు.
ఇన్నేళ్లుగా విడాకుల వ్యవహారంపై తాను మౌనంగా ఉన్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞులుగా ఉండాలని వ్యాఖ్యానించారు. గురువారం ఆమె ఇన్స్టాగ్రాంలో తనను ట్రోల్ చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన ఇన్స్టాగ్రాం ఖాతాలోకి ప్రవేశించి ఏడుపు గొట్టు కథలు చెప్పే అధికారం పవన్ కల్యాణ్ అభిమానులకు లేదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు.
ఇకనైనా తన ఇన్స్టాగ్రాంలోకి వచ్చి సలహాలు ఇవ్వడం ఆపేయాలని కోరారు. ‘‘అభిమానుల అవధుల్లేని మూర్ఖత్వానికి తెరపడి నేను స్వేచ్ఛగా సోషల్ మీడియాను తెరిచి నా గురించి, నా పని గురించి కామెంట్లు చదువుకొనే రోజు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చెప్పారు.