తెలుగు ఇండస్ట్రీలో హీరో గోపిచంద్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  అయితే లౌక్యం చిత్రంలో గోపిచంద్ కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ వరుసగా అజజయం పాలయ్యాయి.  తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'పంతం'.   ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాదు గోపీచంద్‌ నటిస్తోన్న 25వ చిత్రం ‘పంతం’. గ్లామర్ బ్యూటీ మెహరీన్ పిర్జాదా కథానాయికగా నటిస్తోంది. ‘బలుపు’, ‘పవర్’, ‘జై లవ కుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Image result for పంతం
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధించిన గోపీచంద్ హిట్ కొట్టేందుకు ఈసారి పొలిటికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌ను ఎంచుకున్నారు.
Image result for పంతం
పంతం టీజర్‌ లంచగొండి నాయకులకు ఓటేసి గెలిపించిన ప్రజలకు స్ట్రాంగ్‌గానే క్లాస్ పీకారు. ఫ్రీగా ఇళ్లు ఇస్తాం.. కరెంటు ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకి ఐదువేలు ఇస్తాం అనగానే ముందు వెనుక, మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి.. కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుండి వస్తాయ్’ అంటూ గోపీచంద్ చెప్తున్న డైలాగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. 

తాజాగా ‘పంతం’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ శుక్రవారం యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సినిమా  ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది.  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన పంతం.. వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: